Sunday, July 4, 2021

ఈకాలంలో ఇలాంటి స్త్రీలున్నారా

ఈకాలంలో ఇలాంటి స్త్రీలున్నారా




సాహితీమిత్రులారా !



నెల్లూరును పరిపాలించిన మమసిద్ధికి,
కాటమరాజుకు పుల్లరి(పశువులను మేపగా
ఇచ్చే సుంకము) విషయంలో పోరు ఏర్పడింది.
మనుమసిద్ధి పక్షాన ఖడ్గతిక్కన యుద్ధం చేస్తూ
సైన్యం చిందర వందర కాగా రణరంగం వదలి
ఇంటికి వచ్చాడు. అప్పుడు అతని భార్య తిక్కనకు
స్నానానికి నీళ్ళుతోడి నులకమంచం అడ్డం పెట్టి,
పసుముద్దకూడ పెట్టిందట. అది చూచిన తిక్కన
ఇదేమిటని అడగ్గా ఈ పద్యం చెప్పిందట-

పగరకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకులెందున్
ముగురాడువారమైతిమి
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్

అన్నదట.
శత్రువులకు వెన్నిచ్చి పారిపోతే
మగతనం ఉన్న వారు నవ్వరా
వగపెందుకు  ఇప్పటి వరకు
ఇద్దరమే ఆడవాళ్ళం ఉన్నాము.
(ఆమె వాళ్ళఅత్త)- ఇకముందు మనం ముగ్గురము
ఆడవాళ్ళవుతాము - అని హేళన భావంతో పలికింది.

ఆ వీరపత్ని పేరు మాంచాల

ఇపుడు ఇలాంటి స్త్రీలు లెవరైనా ఉన్నా
భర్తకు పౌరుషం తెప్పించి యుద్ధానికి పంపగలిగే
వీరపత్నులు. ఆలోచించాలి
ఆనాటి స్త్రీలకు నేటి స్త్రీలకు ప్రతి విషయంలోను.

No comments:

Post a Comment