Tuesday, July 20, 2021

శివుడు కొండలపై ఎందుకుంటాడు?

 శివుడు కొండలపై ఎందుకుంటాడు?




సాహితీమిత్రులారా!



పూర్వం ఏ ఇంటిలో పట్టినా

నల్లులు విపరీతంగా ఉండేవి.

ఇక దోమల సంగతి చెప్పక్కరలేదు.

సీతారామయ్య అనే ఐయన ఇంటికి

వెళ్ళిన కవిగారు వాటితో పడిన బాధను

పద్యంలో ఇలా చెప్పారు చూడండి-


నల్లులు లేవని వస్తిమి,

కొల్లలుగా చేరఁడేసి గోడలవెంటన్

నల్లులకు తోడు దోమలు

చిల్లులుబడఁ గుట్టెనయ్య సీతారామా!


ఎంత కసిగా కుట్టాయో పాపం

దాంతో ఏకంగా పద్యం తన్నుకొచ్చింది.

శివుడద్రిపై శయనించుట

రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం

డవిరతమును శేషునిపై

పవళించుట నల్లి బాధ పడలేక సుమా!


శివుడు కైలాసపర్వతంపై పడుకోవడం

సూర్యచంద్రులు ఆకాశంలో ఉండటం

విష్ణువు పాముపైనుండి దిగకుండా

పడుకోనుండడం ఎందుకంటే

నల్లి బాధ పడలేకట

కవి నల్లి బాధను ఎంతగా భరించారో

అది ఇంత చమత్కారంగా చెప్పాడు.

ఇప్పుడు దాదాపు నల్లు అంతరించాయని

అనుకుంటాను అందుకే కొందరికి నల్లి అంటే

ఏమిటో తెలియడంలేదు. మంచిదే

కవిగారు చెప్పినట్లు కాకుండా శివుడు సూర్యచంద్రులు

విష్ణువు పడుకోవడానికి వేరేమైన ప్రత్యామ్నాయం

దొరకవచ్చు.

No comments:

Post a Comment