Sunday, May 23, 2021

పూర్వం ఒకరికంటే ఎక్కువ మంది పురుషులను వివాహమాడిన స్త్రీలు

 పూర్వం ఒకరికంటే ఎక్కువ మంది పురుషులను వివాహమాడిన స్త్రీలు




సాహితీమిత్రులారా!



పూర్వం ద్రౌపది వలె అనేక మందిని
పురుషులను వివాహమాడిన స్త్రీలు
ఎవరైనా ఉన్నారా?

అలాంటివారిలో కొంతమందిని ఇక్కడ చూద్దాం-

మత్స్యపురాణం, దేవీభాగవతాల్లోని విషయం.

1.కీర్తమతి అనే స్త్రీ ఐదుమందిని వివాహమాడింది
   వారు శుకమహర్షి, పీవరకి పుత్రులు.
  1. భూరిశ్రవుడు, 2. గౌరప్రభుడు, 3. కృష్ణుడు,
   4. శంభుడు, 5. దేవశ్రవుడు
   (ఈ ఐదుగురూ అన్నదమ్ములే)
   (జనకరాజర్షి గృహస్థాశ్రమమే
    ముక్తిదాయకమని బోధించడం వల్ల
    శుకుడు పీవరను వివాహమాడాడు)

2.అజిత - ఔశీనరపతి కుమార్తె.
  నితంతుడు అనే రాజర్షి కుమారులు
  ఈమెను స్వయంవరంలో వివాహం చేసుకున్నారు.
  1. సాల్వేయుడు, 2. శూరసేనుడు, 3. శ్రుతసేనుడు,
  4. బిందుసారుడు, 5. అతిసారుడు
     ఈ గాథ వ్యాసభారతంలోనిది.
3. మారిష -ఈమె 11మందిని వివాహమాడింది
   ప్రాచీన బర్హి యొక్క పుత్రులు ప్రచేతసులు
   ప్రచేతసులకు మారిషకు కలిగిన పుత్రుడే దక్షప్రజాపతి.
   విష్ణుపురాణంలోను, మత్స్యపురాణంలోను
   వీరి కథ విపులంగా ఉంది.
4. జటిల - జటిలుని పుత్రిక
   (గౌతమ మహర్షి వంశంవాడైన జటిలమహర్షి కుమార్తె)
   ఈమె ఏడుగురు ఋషులకు భార్య అయింది.
   ఈ గాథ వ్యాసభారతంలో ఉంది.


No comments:

Post a Comment