Friday, May 15, 2020

కవిచమత్కారం


కవిచమత్కారం 




సాహితీమిత్రులారా!
Welcome to Andhra Pradesh Library Association | 1st President of ...
ఒకనాటి సాయంకాలం నాటకసమాజంలో
అందరూ కలిసి పకోడీలు
తింటూ ఉండగా చిలకమర్తి వారితో
టంగుటూరు ప్రకాశంపంతులుగారు
 "మీరు పకోడీమీద పద్యాలు చెప్పండి
పద్యానికి ఒక పకోడీ ఇస్తాను" అన్నాడట.
"కవులకు అక్షరలక్షలు ఇచ్చే కాలం గతించింది.
పద్యానికి పకోడీ ఇచ్చే దుర్దినాలొచ్చినై" అని,
వెంటనే
ఈ క్రింది పద్యాలు చెప్పారట
చిలకమర్తివారు.

వనితల పలుకుల యందున
ననిమిష లోకమున నున్న దమృత మటంచున్
జనులనుటేగాని లేదట
కనుగొన నీ యందమృతము గలదు పకోడీ!

ఆ కమ్మదనము నా రుచి
యా కర కర యీ ఘుమ ఘుమ యా పొంకము లా
రాలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు నిజము పకోడీ!

కోడిని దినుటకు సెలవున్
వేడిరి మును బ్రాహ్మణులును వేధన తండున్
కోడి వలదా బదులుగ ప
కోడిం దినుఁడనుచుఁ జెప్పకూర్మి పకోడీ!

No comments:

Post a Comment