Friday, September 30, 2016

తిరిపెమున కిద్దరాండ్రా!


తిరిపెమున కిద్దరాండ్రా!


సాహితీమిత్రులారా!



శ్రీనాథుని గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం.
ఎన్ని మార్లు చెప్పుకున్నా అవి తరగనివి ఆయన చమత్కారాలు
ఆయన ఒకమారు ప్రయాణ మధ్యంలో బాగా దాహమై తాగడానికి
నీరేదొరకని సందర్భంలో చెప్పిన పద్యం ఇది-

సిరిగలవానికి చెల్లును
తరణుల పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపెమున కిద్ద రాండ్రా
పరమేశా గంగవిడుము పార్వతి చాలున్

బాగా ధనముండే శ్రీకృష్ణుడు పదహారువేలమంది
గోపికలున్నా పరవాలేదు ఎందుకంటే
ఆయనకు ధనముంది చాకగలడు.
 ఓ పరమేశ్వరా! మరినీవో తిరిపెగానివి(బిక్షగానివి)
నీకెందుకయ్యా? ఇద్దరు భార్యలు. (నేను దప్పికలో ఉన్నాను)
గంగను వదలవయ్యా నీకు పార్వతి చాల్లే - అని భావం.

ఎంత బాధలోనైనా
ఇంత చమత్కారంగా చెప్పడం ఆయనకే చెల్లు.

No comments:

Post a Comment