Wednesday, August 31, 2022

ఆముక్తమాల్యదలోని కథేమిటి?

 ఆముక్తమాల్యదలోని కథేమిటి?




సాహితీమిత్రులారా!

ఆముక్తమాల్యద కావ్యాన్ని రచించింది సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు రాయలవారికి కలలో కనబడి, తనపై తెలుగులో ఒక కావ్యం వ్రాయమని కోరాడు. అలా భగవంతుని ఆదేశంతో వ్రాయబడిన కావ్యమే ఈ ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద అంటే తాను ధరించిన పూమాలను భగవంతునికి సమర్పించినది అని అర్థం. అంటే ఇది గోదాదేవి కథన్న మాట. గోదాదేవి కథతో పాటు ఇందులో ఇంకా ఖాండిక్య, కేశిధ్వజుల కథ, యమునాచార్యుని కథ, మాలదాసరి కథ వంటి కొన్ని ఉపకథలు కూడా ఉన్నాయి. తన ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల ప్రతిభకు ఏమాత్రం తీసిపోకుండా అద్భుతమైన రీతిలో ఈ కావ్యాన్ని రచించారు రాయలవారు. ఇక మనం ఆముక్తమాల్యద కథలోకి వెళదాం.

రాజన్ పి.టి.యస్.కె. గారికి ధన్యవాదాలు

Monday, August 29, 2022

చింతామణి నాటకంలో కథ ఏమిటి?

 చింతామణి నాటకంలో కథ ఏమిటి?




సాహితీమిత్రులారా!

చింతామణి నాటకంలో కథ ఏమిటి?

వరవిక్రయం, మధుసేవ, చింతామణి ఈ మూడు నాటకాలు సుమారు వందేళ్ళ క్రితం నాటివి. వీటి రచయిత కాళ్ళకూరి నారాయణరావు గారు. వీరు మంచి రచయిత మాత్రమే కాదు.. గొప్ప సంఘసంస్కర్త, జాతీయవాది కూడా. వీరు వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ వరవిక్రయ నాటకాన్ని, ఇంటిని ఒంటిని గుల్ల చేసే మద్యపానానికి వ్యతిరేకంగా మధుసేవ నాటకాన్ని రచించారు. ఇక ఆనాటి సమాజంలో చాలా కుటుంబాలను ఛిద్రం చేసిన జాడ్యం వేశ్యావ్యామోహం. ఈ జాడ్యానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి నారాయణరావుగారు రచించిన మరో రచనే ఈ “చింతామణి” నాటకం. 

 పరమ భాగవతోత్తముడైన లీలాశుకుని జీవిత కథ ఆధారంగా ఆయన ఈ నాటకాన్ని రచించారు. లీలాశుకుడంటే శ్రీకృష్ణకర్ణామృతం రచించిన మహాత్ముడు. మనం ఎక్కువగా వినే.. “కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం” అనే శ్లోకం ఈ లీలాశుకుడు రచించిందే. 

 ఇక ఈ చింతామణి నాటకం అప్పట్లో విపరీతమైన జనాదరణ పొందింది. ఈ నాటకం ప్రభావంతో వేశ్యల ఇంటికి వెళ్ళే మగాళ్ళ శాతం చాలావరకూ తగ్గిపోయిందట. అంతేకాదు ఎంతోమంది వేశ్యలు తమ వేశ్యావృత్తి వదిలివేసి తమ జీవనానికి న్యాయమైన మార్గాలు ఎంచుకున్నారట. అంతగొప్ప నాటకాన్ని, కొన్ని నాటకాల కంపెనీల వాళ్ళు పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. జనాన్ని ఆకర్షించడం అనే పేరు చెప్పి ఆ నాటకంలో ద్వంద్వార్థాలను, ఆశ్లీలతను జొప్పించారు. కొన్ని వర్గాలను కించపరచేలా అసభ్యమైన సంభాషణలు కూడా ఇరికించేశారు. దానితో ఇది చిలికి చిలికి గాలివానై ఈ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిషేధించేంత వరకూ వెళ్ళింది. నిజానికి నిషేధించాల్సింది నాటకాన్ని కాదు. ఈ నాటకంలో జొప్పించిన అసభ్యతను. గతం 30 సంవత్సరాలుగా ప్రదర్శితమవుతున్న చింతామణి నాటకానికి, కాళ్ళకూరి నారాయణరావుగారు రచించిన చింతామణి నాటకానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. మన భాషాభిమానులంతా పూనుకుంటే అసలైన చింతామణి నాటకానికి తిరిగి ఊపిరిపొయ్యవచ్చు. ఇక “చింతామణి” నాటకంలో కథేమిటో చూద్దాం.


పిటియస్కె రాజన్ గారికి ధన్యవాదాలు


Saturday, August 27, 2022

మనుచరిత్రలోని కథేంటి?

 మనుచరిత్రలోని కథేంటి?




సాహితీమిత్రులారా!

అల్లసాని పెద్దనగారి

మనుచరిత్రలోని కథేంటి

పి టి యస్ కె రాజన్ మాటల్లో

ఆస్వాదించండి-



Thursday, August 25, 2022

పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామదేవతల కథేమిటి?

 పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామదేవతల కథేమిటి?




సాహితీమిత్రులారా!

అంశం - పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామదేవతల కథేమిటి?

మన ఊర్లలో పోలేరమ్మ, మావుళ్ళమ్మ మొదలైన గ్రామదేవతలకు జాతర్లు జరుగుతున్నప్పుడు ఆ  యా దేవతలతో పాటూ పోతురాజుని కూడా పూజించడం చూస్తుంటాం. మన జానపదసాహిత్యంలో కూడా మనకీ పోతురాజు పేరు వినబడుతూనే ఉంటుంది.  ఇంతకీ ఈ పోతురాజెవరు? గ్రామదేవతలుగా అనేకచోట్ల పూజలందుకునే అతని అక్కలెవరు? అసలు వారి పుట్టుక వెనుకనున్న ఆసక్తికరమైన కథేమిటి? మొదలైన విషయాలను ఈరోజు  చెప్పుకుందాం. 

మన పురాణవాఙ్మయంలో కానీ, రామాయణభారతాలలో కానీ పోతురాజు కథకు సంబంధించిన ఆధారాలు కనబడవు. కానీ జానపదుల నోళ్ళలో వందల సంవత్సరాలుగా నానుతూ ఈ కథలు చిరంజీవత్వాన్ని సంపాదించుకున్నాయి.

ఈ కథే కాదు, మనం పూజించే గ్రామదేవతలకు సంబంధించిన కథలుకానీ, అయ్యప్పస్వామి, కన్యకాపరమేశ్వరీ వంటి ప్రసిద్ధ దేవతల కథలుకానీ మనకు పురాణాలలో కనబడవు. ఈ కథలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రమే గ్రంథస్థం చేయబడినవి. వీటిలో కొన్ని కథలకు లిఖితపూర్వకమైన ఆధారాలు కూడా ఉండవు. అంతమాత్రం చేత మన గ్రామదేవతల ప్రాశస్త్యానికి గానీ, మనకు వారిపై ఉండే భక్తిభావానికి గానీ వచ్చిన ఇబ్బందేమీ లేదు కదా! పరిశోధక పరమేశ్వరులైన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు "క్రీడాభిరామం" పీఠికలో వ్రాసిన విషములే ఈ వీడియోలో చెప్పబడిన కథకు ఆధారం. ప్రభాకరశాస్త్రిగారీ కథను ఆదిలక్ష్మీ విలాసం, కామేశ్వరీ చరిత్ర అను గ్రంథములనుండి సేకరించారు.



రాజన్ పి.టి.ఎస్.కె గారికి కృతజ్ఞతలు

అజగవ యూటూబ్ ఛానల్ సౌజన్యంతో


Monday, August 22, 2022

శ్రీరామ పట్టాభిషేకం

 శ్రీరామ పట్టాభిషేకం




సాహితీమిత్రులారా!

శ్రీభాష్యం అప్పలాచార్యులవారి వ్యాఖ్యతో

శ్రీరామ పట్టాభిషేకం

ఆస్వాదించండి-



Friday, August 19, 2022

జేబున్నీసా - ఛత్రపతి శివాజీని ప్రేమించిన ఔరంగజేబు కుమార్తె ప్రేమకథ!

 జేబున్నీసా - ఛత్రపతి శివాజీని ప్రేమించిన ఔరంగజేబు కుమార్తె ప్రేమకథ!




సాహితీమిత్రులారా!

పుస్తకపరిచయం

జేబున్నీసా - ఛత్రపతి శివాజీని ప్రేమించిన ఔరంగజేబు కుమార్తె ప్రేమకథ!

రచన - పింగళి నాగేంద్ర

సౌజన్యం - అజగవ యూటూబ్ ఛానల్




Wednesday, August 17, 2022

మిహిరకులుడు - భారతదేశంలో అత్యంత క్రూరుడైన పరిపాలకుని చరిత్ర

 మిహిరకులుడు - భారతదేశంలో 

అత్యంత క్రూరుడైన పరిపాలకుని చరిత్ర




సాహితీమిత్రులారా!

పాశ్చాత్యుల కళ్ళతో భారతీయచరిత్రను చూడక తప్పనిదిగా 

మన విద్యావిధానం తయారైనదనీ, 

అందువల్ల మన అసలు చరిత్ర మరుగున పడిపోతుందనీ, 

భావించిన విశ్వనాథ సత్యనారాయణగారు 

పురాణవైరగ్రంథమాల, కాశ్మీరరాజవంశ చరిత్ర, 

నేపాళరాజవంశ చరిత్ర అనే విభాగాలలో 

ఎన్నో చారిత్రక నవలలు వ్రాశారు. 

ఆ కోవలోనిదే ఈ “మిహిరకులుడు”. ఆస్వాదించండి-





అజగవ యూటూబ్ ఛానల్ వారి సౌజన్యంతో

Monday, August 15, 2022

ఆ శాపం వల్లే మనం ఇలా ఉన్నాం

 ఆ శాపం వల్లే మనం ఇలా ఉన్నాం




సాహితీమిత్రులారా

ఆ శాపం వల్లే మనం ఇలా ఉన్నాం

వ్యాఖ్య- అప్పలాచార్య

ఆలకించండి-



Thursday, August 11, 2022

మంగళహారతి ఎందుకు ఇవ్వాలంటే...?

 మంగళహారతి ఎందుకు ఇవ్వాలంటే...?




సాహితీమిత్రులారా!

మంగళహారతి ఎందుకు ఇవ్వాలంటే...?

వ్యాఖ్య - అప్పలాచార్యులవారు

ఆస్వాదించండి-



Tuesday, August 9, 2022

పద్మము వంటి ముఖము.. కలువలవంటి కన్నులు.

 పద్మము వంటి ముఖము.. కలువలవంటి కన్నులు.




సాహితీమిత్రులారా!

పద్మము వంటి ముఖము.. కలువలవంటి కన్నులు.

ఈ విషయాన్ని అప్పలాచార్యులవారి వ్యాఖ్య

ఆస్వాదించండి-



Sunday, August 7, 2022

అందరినీ అలరించిన అష్టావధానం

 అందరినీ అలరించిన అష్టావధానం




సాహితీమిత్రులారా!

అందరినీ అలరించిన అష్టావధానం

గన్నవరం లలితాదిత్య గారి అవధానం

గరికపాటి నరసింహారావుగారు

కంది శంకరయ్య గారు

చింతా రామకృష్ణారావు గారు

మొదలైన వారు పృచ్ఛకులుగా ఉన్న అవధానం

ఆస్వాదించండి-




Thursday, August 4, 2022

బావమరిది ఇంట్లో ఉంటే ఏమవుతుందో భారతం చెప్పింది!

 బావమరిది ఇంట్లో ఉంటే ఏమవుతుందో భారతం చెప్పింది




సాహితీమిత్రులారా!

బావమరిది ఇంట్లో ఉంటే ఏమవుతుందో భారతం చెప్పింది

ఈ విషయం పై  మల్లాదివారి వ్యాఖ్య వినండి-



Monday, August 1, 2022

పరిహాసం వల్ల జరిగే ప్రమాదం

 పరిహాసం వల్ల జరిగే ప్రమాదం




సాహితీమిత్రులారా!

పరిహాసం వల్ల జరిగే ప్రమాదం

అనే విషయాన్ని అప్పలాచార్యులవారి

మాటలు ఆస్వాదించండి-