Friday, September 30, 2016

కవి ఈశ్వరుడా?



కవి ఈశ్వరుడా?


సాహితీమిత్రులారా!


కవీశ్వరుడు అంటూంటాము
అది ఎలాగో వానమామలై వరదాచార్యులవారు
ఈ పద్యంలో వివరించారు చూడండి.
స్తవరాజ పంచశతిలోని ఈ పద్యంలో
శారదా స్తవరాజములోనిది గమనింపుడు-

మూఁడవ కన్ను గల్గటయు మూర్దమునన్ రసగంగ లుండుటల్ 
వేడుకతో కళానిధుల వీడక నౌదలఁ దాల్చుచుండుటల్ 
కూడును గూడు లేక  సతిఁగూడి దరిద్రత నాశ్రయించుటల్
గాఢ సమాధి నుండుటలుగా కవి నీశ్వరుఁడయ్యె  భారతీ!


ఓ భారతీమాతా! మూడవకన్ను(ప్రతిభా నేత్రం) కలిగిఉండటం,
తలపై రసగంగను కలిగి ఉండుట, సంతోషంగా కళానిధులను(చంద్రుని)
తలదాల్చుట, అన్నమునకు గతిలేక బిక్షమెత్తుట, నిలువనీడలేక
పర్వతముపై ఉండుట,  భార్యతో బాటు దరిద్రము ఆశ్రయించి ఉండుట
ఈ సామ్యాలన్నిటితో కవి తాను ఈశ్వరునిగా పిలువబడెనో - అని భావం.


No comments:

Post a Comment