Saturday, September 10, 2016

ఏపని చెప్పినా ఏదో ఒకటి అడ్డు చెప్పే కొడుకులు కొడుకులా?



ఏపని చెప్పినా ఏదో ఒకటి అడ్డు చెప్పే కొడుకులు కొడుకులా?


సాహితీమిత్రులారా!

పోతన భావతంలో అనేక నీతులు ఉన్నాయి
వాటిలో ఒకటి ఇక్కడ చూద్దాం.

యయాతి,  తనకుమారుడైన పూరుని తనకు యవ్వనం ఇచ్చి
తన ముసలితనం పూరుని తీసుకొమ్మని అడిగే సమయంలో
తండ్రికి పూరుడు చెప్పినవి-

సద్గతిని కోరే వారు మునివృత్తిని
అవలంబించి శ్రమపడటం
దేనికి  జన్మనిచ్చిన తండ్రి
చెప్పిన పని చేస్తే వానికి
సద్గతి కొంగుబంగారమే కదా!
అని అంటూ మరోమాట చెబుతాడు
ఆ పద్యం చూడండి-

పనుపక చేయుడు రధికులు
పనిచిన మధ్యములు పొందుపఱతురు తండ్రుల్
పనిచెప్పిన కోరి పనిచిన 
ననిశము మాఱాడు పుత్రు లధములు తండ్రీ!
                                                     (9-559)

ఓ తండ్రీ! ఇంగితం తెలుసుకొని
చెప్పకుండానే చేసేవారు ఉత్తములు.
చెప్పిన తరువాత పనులు
చేసేవారు మధ్యములు.
తండ్రి ఆజ్ఞాపించినా
చేయకుండా ఏదో ఒకటి అడ్డు చెప్పే
కొడుకులు అధములు - అని భావం.

No comments:

Post a Comment