Sunday, September 18, 2016

ప్రకృతిని మించిన పరమాత్మ లేడు


ప్రకృతిని మించిన పరమాత్మ లేడు

సాహితీమిత్రులారా!

మనం ప్రకృతిలో ఉన్నామా
దీనికి హానికలిగితే మనకూ హానేకదా
అది తెలియక
అభివృద్ధి పేరుతో ఎవరు కూర్చున్న కొమ్మను వారే
నరుక్కున్నట్లు చేసుకుంటూ పోతున్నాం.
మన పిడుగు పాపిరెడ్డిగారు
ప్రకృతికి మించిన పరమాత్మలేడంటున్నాడు
ఆయన "నే చెప్తూనే ఉన్నా" - అనే కవితాసంకలనంలోని
ఈ కవితలో చూడండి-

రసమయ జగత్తు - రమ్యమైన విత్తు
రసికహృదయాలలో - రాశిగా మొలకెత్తు

కృషీవలుని హలంతో - జీవజలం మొలకించు
కవిరాజ కలంతో - రసధార కురిపించు

రాళ్లనే కరిగించి - రత్నాలుగా మార్చు
నాట్యరీతులతోన - నటరాజుగా నిలుచు

శ్రామికుల ఒడిలోన - ప్రేమికునిగా చేరు
కార్మికుల హస్తాల - కర్మిష్టిగా మారు

వసంతాల కేళితో - సీమంతాలు చేయు
భావనా వీచికలలో - జోలలుపాడు

ప్రకృతిని మించిన పరమాత్మలేడు
మానవతను మించిన మతంలేదు

గుణాన్ని మించిన కులంలేదు
ప్రేమను మించిన భావనలేదు

భావాన్ని మించిన భాషలేదు
సేవను మించిన ధాన్యంలేదు

పరార్థాన్ని మించిన పూజలేదు
త్యాగాన్ని మించిన భోగంలేదు

సౌభ్రాతృత్వాన్ని మించిన భాగ్యంలేదు
జగత్తే మనదనుకుంటే విపత్తేలేదు

No comments:

Post a Comment