Saturday, September 17, 2016

అబద్ధం ఏప్పుడెప్పుడు చెప్పవచ్చు?


అబద్ధం ఏప్పుడెప్పుడు చెప్పవచ్చు?



సాహితీమిత్రులారా!

వామనావతారంలో శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తిన మూడడుగులనే
అడుగుతాడు. అప్పుడు రాక్షసగురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని
పక్కకు పిలిచి వచ్చినవాడు విష్ణువు నీవు ఆయనకు మూడడుగులు
ఇవ్వద్దు ఇస్తే ఇబ్బందుపాలవుతావు అని చెబుతూ ఇప్పుడు మాటతప్పినా
పెద్ద ఇబ్బందిలేదు అని చెబుతూ ఈ పద్యం చెప్పాడు.

వారిజాక్షులందు, వైవాహికములందు
ప్రాణవిత్తమాన భంగమందు
చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము పొందదధిప

ఓ అసురేంద్రా! ఆడవారి విషయంలోనూ, వివాహవిషయాలందు,
ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేప్పుడు,
భయపడిన గోవులను, బ్రాహ్మణులను ఆదుకొనేప్పుడు
అపద్ధం ఆడవచ్చు పాపంరాదు - అని భావం.

దీనిలోని విషయాలను గమనిస్తే ఎప్పుడైనై
అబద్ధం చెప్పవచ్చని తేలిపోతుంది
ఇందులోని విషయాలు అన్నిటిని కాకుండా
విడిగా ఏవిషయం ఉండదని గ్రహించవచ్చు
కావున ఇది సరైనదికాదని చెప్పక్కరలేదనుకుంటాను.

No comments:

Post a Comment