Friday, January 27, 2017

పలనాటికి మాటికి బోవనేటికిన్


పలనాటికి మాటికి బోవనేటికిన్




సాహితీమిత్రులారా!


శ్రీనాథుని చాటువుల్లో ఇది ఒకటి.
ఇది పలనాటిని సందర్శించిన తరువాత
ఆయన అభిప్రాయంగా చెప్పవచ్చు

అంగడి యూరలేదు వరియన్నము లేదు శుచిత్వమేలే
దంగన లింపులేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై
భంగపడంగఁ బాల్పడు కృపాపరులెవ్వరు లేరు దాతలె
న్నంగ సున్న గాన పలనాటికి మాటికి బోవనేటికిన్

ఈ పద్యంలో పల్నాడులోని నాటి పరిస్థితులను
మన కళ్ళకు తన కళ్ళతో చూపుతున్నాడు శ్రీనాథుడు-

పలనాడులో గ్రామల్లోదుకాణాలు లేవు.
తినటానికి వరి అన్నం దొరకదు.
అక్కడి వారికి పరిశుభ్రత అసలే తెలియదు.
స్త్రీలు చూడటానికి అందంగా లేరు.
అందమైన తోటలు కనబడవు. మంచినీళ్ళకు
ఎంతో లోతైన బావులు త్రవ్వి బాధపడుతు
న్నందుకు దయచూపేవారుండరు.
దానగుణం కలవారు కూడ లేరు.
అటువంటప్పుడు ఏ సౌకర్యంలేని
పలనాటికి మాటిమాటికి ఎందుకు వెళ్ళాలి?
అని కవి భావన.
అంటే పండితులను, కవులను ఆదరించి
బహుమతులిచ్చే కళాకారులు లేరు.
సుందరమైన దృశ్యాలు లేవు అలాంటప్పుడు
పలనాటికి మాటిమాటికి వెళ్లడం వృధా అని
శ్రీనాథుడు నిరసన భావాన్ని ఈ పద్యంలో తెలిపాడు.

No comments:

Post a Comment