Sunday, January 15, 2017

నుతియింప నుండుమిక నీ భూమీస్థలిన్ పత్రికా!


నుతియింప నుండుమిక నీ భూమీస్థలిన్ పత్రికా!




సాహితీమిత్రులారా!

రాజా బహదూర్ పంగళి వెంకట రామారెడ్డి గారి
సహకారంతో గోలకొండ పత్రిక అభివృద్ధి చెందాలని
ఆశీర్వదిస్తూ అహళ సింగరాచార్యులుగారు పెప్పిన పద్యం-

రాజా వెంకట రామిరెడ్డి సుతవై రాజద్యశశ్శాలివై
తేజోరూపవిభాసమానమతివై దివ్యప్రభారాశివై
భ్రాజ త్పండిత పద్యగద్యనికరోద్భావైక సంభావ్యవై
భూజానుల్నుతియింప నుండుమిక నీభూమీస్థలిన్ పత్రికా!


తెలంగాణాలో విద్య, చైతన్యం చాలా తక్కువగా ఉన్నరోజుల్లో
గోలకొండ పత్రిక తెలంగాణా ప్రాంతానికి జాగృతి కల్గించింది.

రాజా బహదూర్ పింగళివెంకట రామారెడ్డి సహకారంతో
ఆవిర్భవించి, కీర్తిని గొప్పగాపొంది, తేజస్సుతో పాఠకుల
బుద్ధిని ప్రకాశింప జేస్తూ, గొప్ప ప్రభలతో వెలుగుతూ,
విద్వాంసుల పద్యాలు గద్యాల సమూహంతో ఒప్పుతూ,
ప్రభువులు, సంపన్నులు నిన్ను
పొగడుతుండగా భూమిమీద వర్ధిల్లు -
అని గోలకొండ పత్రికను ఆశీర్వదించారు - అని భావం.

No comments:

Post a Comment