Friday, January 20, 2017

ఎలాంటి వారికైనా పిలిస్తే మనసు ఉరకలేయదా?


ఎలాంటి వారికైనా పిలిస్తే మనసు ఉరకలేయదా?




సాహితీమిత్రులారా!


ఎటువంటి వారికైనా విషయవాంఛలు ఉంటాయి
అనటానికి భర్తృహరి వైరాగ్యశతకంలోని
ఈ శ్లోకం చూస్తే తెలుస్తుంది-

భిక్షాశనం, త దపి నీరస మేకవారం,
శయ్యా చ భూః, పరిజనో నిజదేహమాత్రమ్,
వస్త్రం సుజీర్ణ వతఖణ్డమయీ చ కన్థా,
హాహా! తథాపి విషయా న్న జహాతి చేతః!


భిక్షావృత్తి చేత జీవిస్తుండే వారిని పరికిద్దాం -
వారికి భిక్ష ద్వారా లభించిందే ఆహారం.
అదికూడా సారహీనమైనదే లభిస్తుంది గాని
పంచభక్్యపరమాన్నాలు గావు. ఆ నిస్సారమైన
భిక్ష అయినా ఒక్కపూట మాత్రమే.
ఇక పరుండటానికి లభించే పరుపు - కటికనేల.
కేవలం తన దేహం తప్ప. ఏ పరివారం చుట్టుపక్కల ఉండదు.
చినిగిపోయిన పాత గుడ్జ పేలికలే ధరించే వస్త్రాలు.
ఇలా జీవించే నిర్విణ్ణులకు సైతం చేరరమ్మని స్త్రీ పిలిస్తే
మనస్సు సంభోగేచ్ఛతో ఉరకలు వేయదా? - అని భావం.


No comments:

Post a Comment