Friday, January 20, 2017

ఎవరు తీర్థయాత్రలు చేయలేరు?


ఎవరు తీర్థయాత్రలు చేయలేరు?




సాహితీమిత్రులారా!



ధర్మరాజుతో నారదుడు
ఈ విధంగా అన్నాడు-

వ్రతములు లేనివారు, నుపవాసపరాఙ్ముఖులైనవారు దు
ర్మతులు విహీనశౌచులుఁగ్రమంబునఁదీర్థములాడనోప రా
తత గుణశాలి వీవఖిలధర్మవిదుండవు గావునన్ శుభ
స్థితిఁ జని తీర్థసేవనము సేయుము నీకు నభీష్టసిద్ధిగన్ 
                                                              (శ్రీమదాంధ్రమహాభారతము అరణ్య - 2- 284)


వ్రతాలు చేయనివారు, ఉపవాసాలకు విముఖులైనవారు,
చెడ్డవారు, శుచిత్వములేనివారు, తీర్థయాత్రలు చేయలేరు.
నీవు లెక్కకు మిక్కిలిగా మంచిగుణములు గలవాడివి,
సర్వధర్మములు ఎరిగినవాడివి, కాబట్టి తీర్థాలను
సేవించటానికై శుభప్రదంగా వెళ్ళిరమ్ము
నీ కోరికలు నెరవేరుగాక - అని భావం

కాబట్టి తీర్థయాత్రము అందరూ చేయలేరని
దీని బట్టి తెలుస్తున్నది కదా
ఇది ఆకాలపు మాట
ఇప్పుడు అందరూ తీర్థయాత్రలకు
వెళుతున్నారుకదా  -
అని సందేహం వ్యక్తమౌతుంది. నిజమే
అందుకే యాత్రలకు వెళ్ళినవారు
ఎన్నిరకాలుగా ప్రమాదాలకు లోనవుతున్న
సంఘటనలు చూస్తున్నాముకదా
కారణం ఇదే అయి ఉండవచ్చు
అటువంటి గుణాలు కలవారు
తీర్థయాత్రలు చేయడం
సర్వదా లాభదాయకం
మిగిలినవారు వినోదయాత్రలనాలిగాని
తీర్థయాత్రలనకూడదు.

No comments:

Post a Comment