Tuesday, January 31, 2017

వీరితో వ్యవహారం దుఃఖానికి కారణం


వీరితో వ్యవహారం దుఃఖానికి కారణం




సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం చూడండి-
ఎటువంటివారితో వ్యవహారం
చేయకూడదో చెబుతున్నది.

మూర్ఖశిష్యోపదేశేన 
దుష్టస్త్రీ భరణేన చ 
దుఃఖితైః సంప్రయోగేణ
పండితోऽప్యవ సీదతి
(చాణక్య నీతి దర్పణము - 1-4)

బుద్ధీహీనుడైన శిష్యునికి ధర్మోపదేశం చేసినా,
వ్యభిచారిణి కఠినభాషిణి అయిన స్త్రీని పోషించినా,
నానారోగములచే పీడితులును,
ప్రియజనుల వియోగ పీడితులును,
ధననాశాది కారణములచే దుఃఖితులును ఐనవారితో వ్యవహారం
చేయుటచే బుద్ధిమంతుడైన మనుష్యుడుకూడ
దుఃఖములపాలు కావలసివచ్చును - అని భావం.

No comments:

Post a Comment