Tuesday, April 26, 2016

కుప్పసములు ముర్మరములు కుచకుంభములున్



కుప్పసములు ముర్మరములు కుచకుంభములున్


సాహితీమిత్రులారా!
హేమంత ఋతువును ప్రతికవి తనదైనశైలిలో కావ్యాల్లో వర్ణించారు.
కవికర్ణరసాయనంలో సంకుసాల నృసింహకవి వర్ణన ఈ పద్యంలో చూడండి.

చెప్ప నశక్యంబగు చలి
యుప్పతిలం బాల వృద్ధ యువజనములకుం
దప్పక శరణములయ్యెం
గుప్పసములు ముర్మురములు గుచకుంభములున్ (6-30)

కవి చలికాలంలో ప్రజలు పొందిన బాధను వారు ఆశ్రయించిన శరణములను చెప్పినాడు.
ఆ భయంకరమగు చలిలో బాలురకు చొక్కాలును, వృద్ధులకు కుంపట్లును,
యువజనుయకు వనితల కుచకుంభములును శరణములయ్యాయని
ఈ పద్యం భావం.

No comments:

Post a Comment