Wednesday, April 27, 2016

దిగమ్రింగుము నీ పస కాన నయ్యెడున్


దిగమ్రింగుము నీ పస కాన నయ్యెడున్


సాహితీమిత్రులారా!

మహాకవిశ్రీనాథుడు పలనాటిసీమలో తినే తిండి తినలేక చెప్పిన పద్యం ఇది.

పుల్లసరోజనేత్ర! అల పూతన చన్నుల చేదుత్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితినటంచును నిక్కెద వేల? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ ఉడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లగ నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాన నయ్యెడున్.

ఓ పద్మాక్షా! శ్రీ కృష్ణా! పూతన స్తనాల విషాన్ని తాగాననీ, కార్చిచ్చు మింగాననీ
ఎందుకయ్యా నిక్కుతావు చింత చిగురుతో ఉడుకుడుకు బచ్చలి కూర
జొన్నన్నంతో ఒక ముద్ద మింగు - గొంతు దిగుతుందేమో చూస్తాను.
నీ పస తెలుస్తుంది అని చమత్కారంగా పలికాడు.

No comments:

Post a Comment