Thursday, April 7, 2016

అందఱు నందఱే మఱియు ........


అందఱు నందఱే మఱియు ........

నిన్నటి తరువాయి...
సాహితీమిత్రులారా!
నిన్నటి సమస్య మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలందఱున్ - అనే దానికి ముందుకాలంలో శ్రీనాథకవిసార్వభౌమునికి ఇచ్చిన సమస్య ఇది చూడండి.  కేవలం సర్వనామాలనే ఇచ్చి పూరించమనడం చాల క్లిష్టమైనది. ఒకానొక సమయంలో ఒక సభలో శ్రీనాథమహాకవిని పరీక్షించడానికి  కుత్సితంగ "అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱందఱె" - అనే సమస్యను ఇచ్చారు. దానికి శ్రీనాథుని పూరణ-

కొందఱు భైరవాశ్వములు కొందఱు పార్థని తేరి టెక్కెముల్
కొందఱు ప్రాక్కిటీశ్వరులు కొందఱు కాలుని యెక్కిరింతలున్
కొందఱు కృష్ణ జన్మమునఁ గూసిన వారలు నీ సదస్సులో
నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందరే

భైరవాశ్వములు - కుక్కలు, పార్థుని తేరి టెక్కెముల్ - కోతులు, ప్రాక్కిటీశ్వరులు - వరాహాలు, కాలుని యెక్కిరింతలు - దున్నపోతులు, కృష్ణ జన్మమునఁగూసిన వారలు - గాడిదలు, అంటే సభలోని వారు కుక్కలు, కోతులు, పందులు, దున్నలు, గాడిదలు అని నిందాహేళనం.


No comments:

Post a Comment