Friday, April 22, 2016

తెలుగు పద్యానికి కన్నడ మూలం


తెలుగు పద్యానికి కన్నడ మూలం


సాహితీమిత్రులారా!

"నిరుపహతి స్థలంబు" - అనే పద్యం నిన్న తెలుసుకున్నాము.
దీనికి మూలం కన్నడంలో సూక్తిసుధర్ణవము అనే సంకలన గ్రంథము.
ఇది క్రీ.శ. 1240 లో సంకలనం చేయబడిన గ్రంథం.
రాయలవారు పెద్దనను కృతిచేయమన్నపుడు ఈ కన్నడ పద్యం స్ఫురించి
తెలుగులో ఈ పద్యం చెప్పి ఉంటాడని పెద్దలభావన.
కన్నడ పద్యం -

నిరుపహతిస్థలం మృదుతరాసన మెళ్లుణిసింపుదంబులంనరపిద పుస్తకప్రతతి లేఖకవాచక సంగ్రహం నిరంతర గృహనిశ్చితస్థితి విచారక సంగతి సత్కళత్ర సాదరసయినుళ్ల సత్కవియు మీసువదాగదె కావ్యవార్ధియున్


దీనిలో చివరి పాదం భావం మారినా ఎత్తుగడ పదబంధము
తెలుగు పద్యమునకు కన్నడ మూలమని తెలిసి పోతున్నది.
చారిత్రకంగా చూస్తే పెద్దనకు ఇది 300 సంవత్సరాలకు పూర్వంలోనిది ఈ పద్యం.
దీన్ని బట్టి మన పెద్దనకు తెలుగేకాదు కన్నడం కూడా బాగా తెలుసని అర్థమవుతుంది.

No comments:

Post a Comment