Sunday, April 10, 2016

ఉద్ధతుల మధ్య పేదలుండతరమె?


ఉద్ధతుల మధ్య పేదలుండతరమె?

సాహితీమిత్రులారా!
ఒకప్పుడు రాయలవారు, తనకుమార్తె మోహనాంగితో చదరంగం ఆడుతూ ఉండగా
ఆమె బంటు రాయలవారి మంత్రికి, ఏనుగుకు మధ్యలో చిక్కింది.
మథనపడుతూ మోహనాంగి, " ఉద్ధతుల మధ్య పేదలకుండతరమె" అంటూ
సందర్భానుసారంగా ఉద్ధతులగు మంత్రి, మదపుటేనుగుల మధ్య, బక్కచిక్కిన
తన బంటును తలచుకొంటూ కూనిరాగాలుతీస్తూ గొణుగుకొంటోందట
రసజ్ఞుడగు రాజు దాన్ని పూర్తిగా చదవమన్నాడట. సిగ్గుతో తలవంచుకొని,
తాను సంకుసాల నృసింహకవి వద్ద నాలుగువేల వరహాలిచ్చి,
కొనిన పద్యమున్న తాళప్రతిని అందించినదట.

రాయలవారు ఆ పద్యాన్ని -

ఒత్తుకొనివచ్చు కటితటోద్వృత్తి చూచి
తరుణి తను మధ్య మెచటికో తొలగిపోయె,
ఉండెనేనియు కనబడకున్నె? అహహ!
ఉద్ధతుల మధ్య పేదల కుండ తరమె?

యౌవనంలో, ఒరిపిడి చేసుకుంటూ, మీదికి పెరిగి వస్తున్న పిరుదుల విజృంభణాన్ని చూచి, 
పాపమా యువతి యొక్క నడుము, ఎచ్చటికో లేచి పారిపోయిందట!  ఆహా!  
అక్కడ, నడుము గనక ఉంటే, కన్పడకుండా ఉంటుందా?
గర్వంతో మీదమీదకు వచ్చే ఉద్దండులగు, వారి మధ్యలో (వారి దగ్గర) 
నిరుపేదలు ఉండుటకు వీలగునా?- అని భావం.

No comments:

Post a Comment