Monday, June 6, 2016

శ్రీ శ్రీ - సిరిసిరిమువ్వా!


శ్రీ శ్రీ - సిరిసిరిమువ్వా!


సాహితీమిత్రులారా!
శ్రీశ్రీ పద్యాలు రాయలేదని కొందరు
కేవలం గేయాలే రాశాడని అపోహలో ఉన్నారు.
అది సత్యంకాదు.
శ్రీశ్రీ పద్యాలు చూడండి.
ఇవి అన్నీ కందపద్యాలే. సిరిసిరిమువ్వా మకుటంతో రాశారు.

"పందిన చంపిన వాడే
కందం రాయాల" టన్న కవి సూక్తికి నా
చందా యిస్తానా రా
సేందు కయో షరతులేల సిరిసిరిమువ్వా!

కుర్చీలు విరిగిపోతే
కూర్చోడం మాననట్లు గొప్ప రచనలన్
కూర్చే శక్తి నశిస్తే
చేర్చదగునొకింత చెత్త సిరిసిరిమువ్వా!

అవురా! శ్రీరంగం శ్రీ
నివాసరావూ, బలే మనిషివే, ఇక నీ
కవితా వాద్యం చాలిం
చి వెళ్ళి పొమ్మనకు నన్ను సిరిసిరిమువ్వా!

                                                   ఇంకొన్ని మరోసారి.........



No comments:

Post a Comment