Wednesday, June 8, 2016

త్వ మేవ చతురో జానాసి కాలోచితమ్!


త్వ మేవ చతురో జానాసి కాలోచితమ్!


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి
ఎండాకాలంలో చలివేంద్ర నడిపే యువతి అటుగావెళ్ళే
ఆగంతకునితో
ఈ విధంగా చెప్పింది.
శ్లోకం.........


జ్యేష్ఠేమాసి కఠోర సూర్యకిరణై: సంతప్త గాత్రో భవాన్!
ఏకాకీవ భవాన్! అహంచ తరుణీ! శూన్య ప్రపా వర్తతే!
అస్మిన్ కుబ్జవటే నిరంతరదళే - భోపాంథ! విశ్రామ్యతామ్!
లజ్జా మే కథితుం త్వ మేవ చతురో జానాసి కాలోచితమ్!

నీవు గ్రీష్మసూర్య కిరణముల వేడిమికి అలసిపోయావు!
నేనా ఒంటరిగా ఈ చలివేంద్రలో ఉంటిని!
యువతిని! చలివేంద్రం కనుచూపు వేరలో ఎవ్వరూ లేరు!
ఈ పొట్టి మఱ్ఱిచెట్టు దట్టమైన ఆకులతో గుట్టుగా ఉన్నది.
ఇక్కడ నీవు విశ్రమింపుము.
ఇంతకంటే చెప్పటానికి నాకు సిగ్గుగా ఉంది.
ఇపుడు కర్తవ్యమేమో? నీవే గ్రహింపగలవు!
నీవు చాతుర్యం కలవాడవు!

(ఆమె ఎందుకు పిలిచిందో పాఠకులకూ తెలుసు
  ఇంకేమీ చెప్పక్కరలేదనుకుంటాను.)

No comments:

Post a Comment