Wednesday, June 22, 2016

లలిత లావణ్య విలాసినీ వక్షోజ.....


లలిత లావణ్య విలాసినీ వక్షోజ.....


సాహితీమిత్రులారా!


కూచిమంచి నరసింహంగారు కవిత్వం ఎంత తృప్తినిస్తుందో
ఈ పద్యంలో వివరించారు చూడండి.

మాణిక్య మకుటంబు మౌళిపైఁ దులకింప
          రాజ్యంబు నేలెడు రాజు కంటె
లలిత లావణ్య విలాసినీ వక్షోజ
          పరిరంభ సౌఖ్యానుభవునికంటె
సతతంబు నానంద సౌరాబ్దిలోఁదోఁగు
          భర్మహర్మ్యస్థ సంపన్నుకంటె
ధన వయో రూప సంతానాది భాగ్యాళిఁ
          దనియ సంతుష్టుఁడౌ ధన్యునికంటె
మధురమృదువాక్య సంపద మనసు గరఁచు
కవిత యబ్బిన కవియె యెక్కువ యటంచు
నెంచెదరుగానఁదత్సుఖ మెంత సుఖమొ
స్వానుభవమునఁ గనుగొనఁబూన వలదె!


మాణిక్యకిరీటధారుడైన రాజ్యాన్నేలే రాజు కంటె,
లలితలావణ్యవిలాసవతి కౌగిటిలో సుఖాన్నునుభవించే వానికంటె,
ఎల్లప్పుడు గొప్ప గొప్ప భవంతులలో ఆనందం సంద్రంలే ఓలలాడే సంన్నుని కంటె,
ధనంతో వయసుతో రూపంతో సంతానంతో అన్ని భాగ్యాలను తృప్తిగా అనుభవించే ధన్యునికంటె
మృదుమధురమైన మాటలతో కవిత్వం అబ్బిన కవి ఎక్కువ అని ఎంచి ఆ సుఖమెంతో
స్వానుభవంతోనె తెలుసుకోవాలిగాని అది చెప్పడం ఎలా?
- అని భావం.

No comments:

Post a Comment