Thursday, July 14, 2016

మెరుగు పాలిండ్ల నడిగెనో మెలతనతడు


మెరుగు పాలిండ్ల నడిగెనో మెలతనతడు


సాహితీమిత్రులారా!

ఈ కమనీయ చమత్కార పద్యం చూడండి.
ఒక భోజనపంక్తిలో ఒక ఉన్నతస్తని అన్నం వడ్డిస్తుంటే
పంక్తిలో తింటూఉన్న వాళ్ళలో ఒక యువకుడు
వడ్డించే  ఆవిడను ఈ విధంగా అడిగాడు
ఆ పద్యం.......

పద్మ కోశాభినయ హస్త వల్లపంబు
చూపె నావేళ రమణికి సాబగు డొక్క
డంత యోగిర మడిగెనో యంతలేసి
మెరుగు పాలిండ్ల నడిగెనో మెలతనతడు

వడ్డించే యువతికి భోజనంచేసే యువకుడు
చేతిని తామర మొగ్గలా చూపాడట అంత అన్నమే అడిగాడో,
ఆమె పాలిండ్లనే అడిగాడో - అంటున్నాడు కవి.

No comments:

Post a Comment