Friday, July 1, 2016

రాయని జాబులు, రాని ఉత్తరాలు


రాయని జాబులు, రాని ఉత్తరాలు


సాహితీమిత్రులారా!

డా. ధారా రామనాథశాస్త్రిగారు ఎఱ్ఱనగారికి కొన్ని జాబులు రాశారు.
ఎఱ్ఱన ఆయనకు జవాబులు రాశారు. ఇది కడుచిత్రం కదా!
అందుకే ఆయన రాయని జాబులు, రాని జవాబులు పేరుతో
కొన్ని లేఖలు రాశారు.
వాటిలోని ఒక లేఖ ఎఱ్ఱనకు రాసింది.
చూడండి-

మహారాజశ్రీ చెదలవాడ ఎఱ్ఱాప్రెగ్గడ గారికి,
        నమస్కారములు, ఉభయకుశలోపరి. అడ్రసు వ్రాయడంలో పొరపాటువలన 
ఉత్తరం ఆలస్యమైనందుకు చింతిస్తున్నాను. మీ సందేశం మా అందరికీ సంతోషాన్ని 
కలిగించింది. కాగా ఎలాగూ మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే అవకాశం కలిగింది. 
కనుక మీతో కొంత సద్గోష్ఠి చేద్దామని క్రింది కొన్ని ప్రశ్నలు వ్రాస్తున్నాను. 
మీరు కోపపడక ఓపిగగా అన్నిటికీ సమాధానం వ్రాయండి. 
వీలైనంత త్వరగా వ్రాస్తే అచ్చువేయడానికి వీలవుతుంది.

1. మీరు కవిత్రయంలో చేరిన కవీంద్రులై కూడా మీకు నన్నయ తిక్కనలకు 
    వచ్చినంత పేరు రాలేదు. ఎందుచేత?
2. మీరు అరణ్యపర్వాన్ని పూరించారా? లేక నష్టమైతే మళ్ళీ రచించారా?
3. నన్నయగారి సరససారస్వతాంశ మీమ్మల్ని ఆవేశించినట్టు తద్రచనయకా 
    మీరు పూరించినట్టూ సెలవిచ్చారు. దీంట్లో ఆంతర్యమేమిటి? 
     దయచేసి వివరించండి.
4. మీ కవిత్వం మీద నన్నయ ప్రభావం ఎక్కువా తిక్కన ప్రభావం ఎక్కువా?
    ఇలా ప్రశ్నలడుగుతున్నందుకు కోప్పడవద్దు.
                                                                           ఇట్లు
                                                                       విధేయుడు
                                                               ధారా రామనాథశాస్త్రి
(ఇది ఎఱ్ఱాప్రగ్గడ సాహిత్యవ్యాసాలు(సంకలనం)
 ప్రచురణ- సృజన, అద్దంకి.-లోనిది.)

No comments:

Post a Comment