Monday, March 6, 2017

కాశీలో మరణిస్తే ఆ విభూతి కలుగుతుంది


కాశీలో మరణిస్తే ఆ విభూతి కలుగుతుంది




సాహితీమిత్రులారా!



ప్రౌఢకవి మల్లన కృత
రుక్మాంగదచరిత్రలోని
ఈ పద్యం చూడండి-
కాశీలో మరణిస్తే ఎలాంటి
విభూతికలుగుతుందో తెలుస్తుంది.

కరి కరితోలుఁ గప్పు నురగం బురగంబు ధరించు శాక్వరం
బిరవుగ శాక్వరంబుఁగని యెక్కు మృగంబు మృగంబుఁ బొల్చు భూ
సురవర కాశిలో నధికసుప్తి వహించిన తత్క్షణంబ యే
పురముల కివ్విభూతిపరిపూర్ణత నొందుఁ దలంచి చూచి నన్
                                                                                         (రుక్మాంగదచరిత్రము - 5-59)


ఓబ్రాహ్మణుడా!  కాశీపట్టణంలో
మరణాన్ని పొందినట్లయితే,
వెంటనే ఏనుగు వచ్చి ఏనుగు
తోలును కప్పుతుంది. ఆ జీవుడు
పామయితే పాము వచ్చి తనలో
కలుపుకుంటుంది. ఎద్దయితే
ఎద్దును ఎక్కుతుంది. లేడి అయితే
లేడిగా భాసిస్తుంది. ఎంత ఆలోచించినా
ఐశ్వర్యం తాలూకు (విభూతి) ఈ పరిపూర్ణ
వైభవం ఏ పురాలకు ఉంటుంది.
గజచర్మధారి, నాగభూషణుడు,
వృషభవాహనుడు, మృగహస్తుడు
కావున ెఅక్కడ మరణించిన జీవకోటికి
ఈ విభూతి కలుగుతుంది - అని భావం.

No comments:

Post a Comment