Saturday, March 25, 2017

కాళిదాసు రచనా చమత్కారం


కాళిదాసు రచనా చమత్కారం



సాహితీమిత్రులారా!



కాళిదాసుకు వివాహమైన తరువాత గదిలో  పడుకొని ఉండగా
ఆయన భార్య ఆయన అరసికత చూసి
అస్తి కశ్చి ద్వాగ్విశేషః -  అని అడిగిందట.
 అది ఆయనకు అర్థంకాక
భార్యను అనాదరణ చేశాడని చెబుతారు.
వాగ్విశేషమేమైనా కలదా అని దాని అర్థం.
అంటే ఏమైనా పాండిత్యం కలదా - అని.
తరువాత కాళికాదేవి వరప్రసాదం వలన
పండితుడైన తరువాత భార్యను వీడుకొని
దేశాంతరములకు బోయి భార్యవలననే
తనకు అట్టి విద్యావిశేషములు కలిగెనని
ఆమె మీది విశ్వాసం కలిగి మొట్టమొదట
తనను ఆమె ప్రశ్నించిన ప్రశ్నలో ఉన్న
అస్తి, క్వచిత్,  వాక్, విశేషః - అను
నాలుగు పదాలను  నాలుగు కావ్యాలలో
మొదట చేర్చి గ్రంథరచన చేసెనని
ఆర్యులంటారు.
కుమారసంభవము మొదటి శ్లోకంలోని
మొదటి పాదం-
అస్త్యుత్తరస్యాందిశి దేవతాత్మా- దీనిలో
అస్తి అనే మొదటి మాటను.
మేఘసందేశంలోని మొదటి శ్లోకం
మొదటిపాదం
కశ్చిత్కాంతావిరహగురుణా స్వాధికారా త్ప్మ్రమత్తః
అనే మాయలో కశ్చి అనే మొదటిమాటను

రఘువంశములోని మొదటిశ్లోకంలోని
మొదటిపాదము
వాగర్థావివసంపృక్తౌ-
లో వాగ్ - అనే మొదటిమాటను,
ప్రయోగించాడు. కాని
విశేషః - అనేమాటను ఏ కావ్యంలో
ప్రయోగించాడో తెలియరాలేదు
ఇది కాళిదాసు రచనా చమత్కారం
అంటారు.



No comments:

Post a Comment