Thursday, March 9, 2017

పైన పటారం లోన లొటారం


పైన పటారం లోన లొటారం




సాహితీమిత్రులారా!




భాస్కరరామాయణంలోని
యుద్ధకాండలో 1562 పద్యాలను
అయ్యలభట్టు కూర్చాడు.
అందులోని ఈ పద్యం చూడండి-
ఇంద్రజిత్తు వేసే బాణాలకు వానరులు
భావించిన తీరు ఇందులోని విషయం-

పిడుగులొకో కావు పొడతేవు ఘనము 
                              లుల్కా సహస్రంబులో కావుధరణి
యడలదు కాల సర్పావళు లొకొ కావు 
                              పాతాళ వివరంబు బయలుపడదు
ఖరమైన ముక్కంటి కంటి మంటలొ కావు 
                              జగదవసానంబు జాడలేదు
కాలకూటార్చులో కావు మందరగోత్ర 
                               మానితాంభోరాశి గానబడదు
మొదలెరుంగరాదు ముసుకొని పుట్టిన
చొప్పు దెలియరాదు చూడ నెచట
నని కపీంద్రు లిట్టు లాజి దల్లడ మంది
రింద్రజిత్తు తూపు లేపు మాప
                                       (భాస్కరరామాయాణము - యుద్ధ. 1268)

పద్యం చూడటాని చాల బాగుందికదా
లోతు పాతులలోకెళితే విషయం అర్థమౌతుంది
చూడండి-

ఇవి పిడుగులా, కావు, మబ్బులు లేవు.
ఉల్కాసహస్రాలా ధరణి కంపిచదు.
కాలసర్పాలా కావు, పాతాళం బయటకు కనబడదు
శివుని కంటి మంటలా, జగత్ప్రళయం కనబడదు
అని వానరులు తల్లడిల్లారట
ఇంతవరకు పద్యం బాగానే ఉంది కాని
ఇందులో ఔచిత్యం లేదు అని
ఆరుద్రగారు తన ప్రాణాలమీదకు
వచ్చినపుడు  ప్రపంచం అంతమై
పోతుందని భావిస్తే సహజంగా ఉంటుంది
ఇందులో జగదవసానకాలం కాదనుకోవడంలో
ఏమి ఔచిత్యం ఉంది అని అంటారు.

No comments:

Post a Comment