Sunday, February 26, 2017

హోత్రి, ఉద్గాత్రి, అధ్వర్యు ............


హోత్రి, ఉద్గాత్రి, అధ్వర్యు ............



సాహితీమిత్రులారా!

యజుర్వేద కాలంలోని పురోహితులు
నాలుగువిభాగాలలో 16, 17 మంది
కనబడతారు వారి వివరాలు ఇక్కడ చూద్దాం-

యజ్ఞంలో నిర్వహించే బాధ్యతలు 4 రకాలు
వాటిని బట్టి పురోహితులూ నాలుగువిధాలు

1. మంత్రోచ్ఛారణ చేసేవారిని హోత్రి అంటాము
   ఈయనకు సహాయకులుగా మైత్రావరుణుడు, 
   అచావాకు, గ్రావస్తుతు ఉంటారు

2. ప్రత్యేక మంత్రోచ్ఛారణ విధిని నిర్వర్తించేవారు - ఉద్గాత్రి    
   అనబడతారు. ఈయనకుప్రస్తోత్రి, ప్రతిహర్త్రి, సుబ్రహ్మణ్య
   అనే వారు సహాయకులుగా ఉంటారు.

3. యజ్ఞంలో జరిగే కర్మకాండలను నిర్వర్తించేవారిని అధ్వర్యు
   అంటారు. వీరికి ప్రతిష్ఠాత్రి, నేష్ట్రి, ఉన్నేత్రి అనే వారు   
   సహాయకులుగా ఉంటారు.

4. మొత్తం యజ్ఞాన్ని పర్యవేక్షించే వారిని బ్రాహ్మణుడు అంటారు.
   వీరికి బ్రాహ్మణచ్ఛంసి, అగ్నీధ్ర, పోత్రి సహాయకులుగా ఉంటారు.

ఈ చెప్పిన 16 మందిని ఋత్విజులు అంటారు
వీరుగాక తక్కువ స్థాయిలో ఉన్నపురోహితులు
శమిత్రి, వైకర్త, సమసాధ్వర్యు అనే వారు
అధ్వర్యునకు సహాయకులు.
మొత్తం యజ్ఞాన్ని పర్యవేక్షించేవాడు 17వ ఋత్విజుడు
ఈయనను కౌశీతకులు అంటారు.
పర్యవేక్షకునికి 3 వేదాలు తెలిసి ఉండాలి
ఎటువంటి పొరపాట్లయినా సవరించగలిగి ఉండాలి

యజ్ఞం నిర్వహించటానికి ఆకాలంలో
ఎంత యంత్రాంగం ఉన్నదో
వీటిని బట్టి తెలుస్తుంది.

No comments:

Post a Comment