Saturday, February 25, 2017

పూర్వకవిత్వం


పూర్వకవిత్వం




సాహితీమిత్రులారా!



పూర్వకవుల పద్యాలలోని మొదటి మూడు పాదాలు
తీసుకొని నాలుగవ పాదాన్ని సందర్భోచితంగా
చాతుర్యంతో కవి కలిపి పూర్తి చేయడాన్ని
పూర్వకవిత్వం అంటున్నారు.
ఇది మల్కిభరాముని కాలంలో
ప్రారంభమైందని కొందరి భావన
దీనికి ఉదాహరణ-

కరయుగములు చరణంబులు
ఉరము, లలాట స్థలంబు, నున్నత భుజముల్
సరి ధరణి మోపి మ్రొక్కిరి
మరిమరి నీ శత్రువులెల్ల మల్కిభరామా!

దీనిలో మొదటి మూడు పాదాలు పూర్వకవులవి
చివరి పాదం ఈ చెప్పిన కవిది.

No comments:

Post a Comment