Wednesday, February 22, 2017

వారే గాలికి, తుఫాన్లకు ప్రతినిధులు


వారే గాలికి, తుఫాన్లకు ప్రతినిధులు




సాహితీమిత్రులారా!


దితి కశ్యపుల కుమారును ఇంద్రుడు చంపుతూండేవాడు.
దితి బాధపడి, ఇంద్రుణ్ని జయించే కుమారుణ్ని ప్రసాదించమని
ప్రార్థించింది. తరువాత దితి గర్భవతి కాగా-
తనను చంపే కొడుకు పుట్టనున్నాడని తెలిసి
ఇంద్రుడు సూక్ష్మరూపంలో ఆమెగర్భంలో ప్రవేశించి,
ఆ పిండాన్ని ఏడు ముక్కలుగా ఖండించాడు,
వాటిని తిరిగి ఒక్కోదాన్ని ఏడు ముక్కలుగా చేశాడు.
ఇలా ఆ పిండం మొత్తం 49 ముక్కలయింది.
దితి మేల్కొని, అలా చంపవద్దనీ,
ఈ బిడ్డలు నీకు మిత్రులే అవుతారనీ చెప్పి, ప్రార్థించింది.
ఆ పిండంనుండి ఏర్పడిన 49మంది బిడ్డలు ఎంతకూ
మరణించకపోవడంతో వారూ దేవతలే అని చెప్పి,
వాళ్ళకు మరుత్తులు(గాలి) అని పేరు పెట్టాడు.
వారే మరుద్గణం. వీరే గాలికి, తుఫాన్లకు ప్రతినిధులు.

No comments:

Post a Comment