Thursday, February 23, 2017

శివునితో పోలినవాడని పోల్చవచ్చునా?


శివునితో పోలినవాడని పోల్చవచ్చునా?




సాహితీమిత్రులారా!



వేములవాడ భీమకవి పద్యాలలో
ఒక పద్యం ఇది చూడండి-
మైలమ భీముని పరాక్రమం
గురించి చెప్పన పద్యం-

అహితుల దాకి పోరునెడ నంబుధి కల్గిన నాటి రాము గో
గ్రహణము నాటి పార్థు గదఁ గౌరపు వేసిన నాటి భీము నా
గ్రహమెసగం బుర త్రయము గాల్చిన నాటిలలాటలోచనున్
మహితనుపమింపగా దగునె మైలమ భీముని భీమ విక్ర మున్


మైలమ భీముడు శత్రువులను ఎదిరించి పోరాడేప్పుడు,
రామాయణంలో సముద్రునిపై కోపించిన శ్రీరామునితో,
భారతంలో ఉత్తరగోగ్రహణమప్పుడు పరాక్రమించిన అర్జునితో,
గదాయుద్ధంలో దుర్యోధనుని పడవేసిన భీముని రౌద్రంతో,
త్రిపురాసురసంహారముచేసిన శివునితో పోలినవాడనవచ్చునా
కాదు - వారిని మించిన పరాక్రమం కలవాడీయన
కావున వారందరు ఇతనికి సమానులుకాదు - అని భావం

మైలమ భీముడు ఎంతటి గొప్పవాడో ఇందు
వాడిన ఉపమానాలను బట్టి తెలుస్తుంది.

No comments:

Post a Comment