Sunday, October 23, 2016

జానణదేవర! శ్రీపంచశర విరించి!


జానణదేవర! శ్రీపంచశర విరించి!



సాహితీమిత్రులారా!

భీమఖండంలో శ్రీనాథమహాకవి
దక్షారామంలోని వేశ్యలను
బ్రహ్మదేవుడు ఎలా సృజించాడో
ఈ పద్యంలో వివరించాడు చూడండి.

అంబుధరశ్రేణి, హరిలాంఛనరేఖ, 
                           కమ్రకార్ముకవల్లి, కామతల్లి
జలచరద్వందంబు, చంపకప్రసవంబు, 
                          బింబంబు, దాడిమబీజరాజి
శష్కులీయుగళంబు, చారుదర్పణములు, 
                          శంఖంబుబిసములు, జలరుహములు
పసిడి కుంభములు, బయలంబువీచులు, 
                          పుష్కరావర్తంబు, పులినతలము
కదళికా హేమకాహళకచ్ఛపములు
మణులబంతులు తారకామండలములు
సంఘటించి పురంబు వేశ్యల సృజించె
జాణదేవర! శ్రీపంచశర విరించి!
                                         (భీమఖండము - 1-94)

మబ్బులు, చంద్రకళ, హరివిల్లు, కామతల్లి చక్రవాకములజంట,
సంపంగెపువ్వు, దొండపండు, దానిమ్మగింజలు, బయటిచెవి దొప్పలు,
సుందరమైన అద్దములు, తామరతూండ్లు, తామరపువ్వులు,
బంగారుకుండలు, ఆకాశము, కెరటాలు, నీటిసుడులు,
ఇసుకతిన్నెలు, అరటికంబము, బంగరుమద్దెల, తాబేలు,
మణులబంతులు, నక్షత్రమండలము, మన్మథుడు
 వీటన్నింటిని సంఘటించి చాతుర్యంగల విరించి(బ్రహ్మ)
దక్షారామంలోని వేశ్యలను సృజించాడు - అని భావం.

(ఇందులో చెప్పినవన్నీ ఉపమానాలే,
ఉపమేయాలు వారి అవయవాలుగా గ్రహించాలి.)

No comments:

Post a Comment