Tuesday, October 18, 2016

చుట్టినవారు కావలె యశోవిభవంబులు పొందగా వలెన్


చుట్టినవారు కావలె యశోవిభవంబులు పొందగా వలెన్



సాహితీమిత్రులారా!


విజయవాడలో ఒక ప్రముఖుడు
విదేశాలకు వెళ్ళే సందర్భంలో
ఆచార్య ఉత్పల సత్యనారాయణాచార్యులుగారు
చెప్పిన పద్యం చూడండి
ఎంత శృంగార మధురిమ,
 చాతుర్యం చోటుచేసుకున్నాయో

పుట్టిన చోట నిల్చి పొలుపొందుట కేవల మాడుదాని చ
న్కట్టుకు మాత్రమే తగును గాని మనీషులు, దూర దేశముల్
మెట్టినవారు ద్వీప పటలీవృత్త భూవలయంబు నెల్లనుం
జుట్టినవారు కావలె యశోవిభవంబులు పొందగా వలెన్

పుట్టిన చోటే ఉండి శోభించదగినవి
కేవలం ఆడవారి కుచాలేగాని
మనీషులు(విద్వాంసులు, బుద్ధిమంతులు)
అయినవారు, దూరదేశాల్లో మెట్టినవారు
ప్రపంచమంతా తిరిగి కీర్తిప్రతిష్ఠలను
సంపాదించాలంటారు కవిగారు.


No comments:

Post a Comment