Friday, October 21, 2016

శ్రీమద్రామాయాణం గంగా............


శ్రీమద్రామాయాణం గంగా............


సాహితీమిత్రులారా!


ఈ చమత్కార శ్లోకం చూడండి-
క్రీ.శ.1182-97 ల మధ్యకాలంలో, జయంతిపురాన్ని
పాలించిన కంబవంశరాజు కామదేవుని ఆస్థానంలో
కవిరాజు ఉండేవాడు. ఈ కవి రాఘవపాండవీయం అనే
ద్వ్యర్థికావ్యాన్ని రామాయణ మహాభారతకథలను జోడించి
13 సర్గలలో 668 శ్లోకాలతో రాశాడు.
 ఈ కవిని గురించి చెప్పిన శ్లోకం ఇది చూడండి-

శ్రీమద్రామాయణం గంగా భారతం సాగరోపమాన్
తత్సంయోజన కార్యజ్ఞ: కవిరాజో భగీరథ:

శ్రీమద్రామాయణం గంగానది వంటిది.
మహాభారతం విశాలమైన సముద్రం వంటిది.
ఈ రెంటిని కలిపిన కవిరాజు భగీరథునివంటివాడు
 - అని శ్లోక భావం.

No comments:

Post a Comment