Monday, October 3, 2016

యవనీ నవనీత కోమలాంగీ


యవనీ నవనీత కోమలాంగీ


సాహితీమిత్రులారా!



మొగల్ చక్రవర్తి షాజహాన్ ఆస్థానంలో
జగన్నాథ పండితరాయలు అనే తెలుగువాడు
కొంతకాలం ఉన్నాడట. అతడు చిన్నతనంలోనే కాశీచేరి
గొప్పవిద్వాంసుడయి అప్పటి మొగల్ రాజైన షాజహాన్
దగ్గర ఉన్న సందర్భంలో చక్రవర్తి ఆస్థానంలోని
ఒక యువతిని చూచి ఈ శ్లోకం చెప్పాడట.
చూడండి.

యవనీ నవనీత కోమలాంగీ
శయనీయే యది మామకే శయానా
అవనీతలమేవ సాధు మన్యే
న వనీ మాఘవనీ వినోదహేతు:

వెన్నవలె కోమలమైన శరీరంగల
ఈయవన(మహమ్మదీయ) స్త్రీ
నా శయ్యపై శయనించినట్లయితే
ఇంద్రుని నందనోద్యానవన విహారం కంటే
మామూలు నేల శ్రేష్ఠమని భావిస్తాను - అని శ్లోక భావం.

ఆయువతితో పొందుకలిగితే కటికనేలకూడ
నందనవనంకంటె గొప్పదిగా భావించగలను అని
ఆమెపై తనకుగల గాఢానురాగాన్ని వెల్లడించాడాయన.

No comments:

Post a Comment