Saturday, October 22, 2016

ఖడీహో సురజ్ కీ తపస్యా రకే


ఖడీహో సురజ్ కీ తపస్యా రకే



సాహితీమిత్రులారా!

ఉర్దూసాహిత్యంలో ఫాయజ్ అనే కవి పేరెన్నిక గన్నవాడు.
ఇతని అసలుపేరు సదరుద్దీన్ మొహమ్మద్.
ఈయన ఢిల్లీ ఆస్థానంలో
ఉన్నత ఉద్యోగిగా పనిచేసినవాడు,
గొప్పవిద్వాంసుడు, శ్రీమంతుడు.
పారసీకంలో అనేక రచనలు చేసినవాడు.
ప్రొఫెసర్ మసూద్ హసన్ రిజ్వీ ఇతని
ఉర్దూకావ్య సంగ్రహాన్ని అమూల్యమైన
పీఠికతో అందించారు.
ఈ కవి  రచనల్లో ఆనాటి సాంస్కృతిక,
సామాజిక జీవన చిత్రాలు చూడ
ముచ్చటగా ఉంటాయి.
ఢిల్లీలోని ఒక ప్రదేశాన్ని వర్ణించిన
ఈ కవితను చూడండి-

హై ఇందర్ కి మానో సభా జల్వగర్
కి హర్ నార్ దిస్తీ హై రంభాసొఁవర్
కమర్ పర్ జో పడ్తే హై సబ్ మూయె-సర్
ఉనా బీచ్ మిల్ జాతా మూయే-కమర్
లజాతీహైఁ జూఁ అప్సరా జీకో చల్
కీ దేఖ్ ఉన్కో పానీమె దిల్ జాయె జల్
హర్ ఎక్ నార్ సూరజ్ సి శోభా ధరే
ఖడీహో సురజ్ కీ తపస్యా కరే

దీని భావం ఈవిధంగా ఉంది -
ఇంద్రుని సభ శోభాయమానమై ఉన్నట్లున్నది.
ప్రతి స్రీ రంభకంటె అందకత్తె.
నడుముపై శిరోజాలు పడినప్పుడు
శిరోజమువంటి నడుమందే ఎక్కడో లుప్తమైపోయినది.
వారు అప్సరసలవలె హృదయాన్ని బాధిస్తారు.
వీరిని నీటిలో చూడగా హృదయం దహించుక  పోతుంది.
ప్రతి స్త్రీ సూర్యనివంటి శోభకలది.
నిలుచుండి సూర్యుని గూర్చి
తపస్సు చేస్తున్నట్లుంటుంది.

No comments:

Post a Comment