Saturday, December 17, 2016

కాలము దుస్తరమెట్టివారికిన్


కాలము దుస్తరమెట్టివారికిన్




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి -
శకుంతలను మరచిపోయిన దుష్యంతుడు
ఆమె తన భార్యకాదని, అసత్యము చెబుతున్నదని
పలికే సందర్భములో కాళిదాసు కూర్చినది.

స్త్రీణా మశిక్షిత పటుత్వమమానుషీషు
సందృశ్యతే కిముత యాః ప్రతి బోధవత్యః
ప్రాగంతరిక్షగమనా త్స్వమపత్యజాత
మన్యై ర్ద్విజైః పర భృతాః ఖలు పోషయన్తి
                                                                        (అభిజ్ఞాన శాకుంతలమ్)

స్త్రీ జాతికి ఎటువంటి శిక్షణ లేకుండానే చాల
చాతుర్యంతో పనులు జరుపుకోవటం పశుపక్ష్యాదుల్లోనే
కనిపిస్తున్నప్పుడు తెలివితేటలు కలిగిన మనుష్యుల
విషయంలో పెప్పవలసిన దేముంది కోకిలలు తమ
గ్రుడ్లను తాముపొదకుండా కాకుచే పొదిగించి,
పిల్లలు పుట్టిన తరువాత రెక్కలు వచ్చేవరకు
కాకులతోనే పోషింపచేస్తాయి. తమకు శ్రమలేకుండా
ఇతరులతో ఆ భారం మోయించటం ఎంత తెలివి
కలపని?

అదే విదంగా ఈ శకుంతల కూడ మహారాజు
భార్యగా అంతఃపురంలో ప్రవేశించి రాజ భోగాలు
అనుభవించాలని ఇలా అబద్ధం చెబుతున్నది
అని దుష్యంతుడు ఆరోపించాడు - అని భావం

ఎంత సత్యమైనా కాలం దాన్ని
ఎందుకూ కొరగాకుండా చేసిందికదా!
అందుకే కాలము దుస్తరమెట్టివారికిన్ -
అన్నారు పెద్దలు.

No comments:

Post a Comment