Monday, December 26, 2016

ఈ శ్లోకం చెప్పేదేందంటే.........


ఈ శ్లోకం చెప్పేదేందంటే.........




సాహితీమిత్రులారా!

కృష్ణదేవరాయల పరాక్రమాన్ని
వర్ణించే శ్లోకం ఇది. చూడండి-

వీరాగ్రేసర కృష్ణరాయ భవతా కృత్తా రణప్రాంగణే
ప్రౌఢాః కేచన పారసీకపతయః ప్రాప్తాః పురీ మామరీమ్
పీరుత్తేతి గురౌ, బలద్విషి సురత్తాణేతి, శచ్యాం పున
ర్బిబ్బీతి, ప్రణతౌ సలామితి సురాన్ స్మేరా ననా మ్కర్వతే

వీరులలో గొప్పవాడైన ఓ కృష్ణదేవరాయ
నీతో యుద్ధం చేసి చంపబడిన పారశీకరాజులు
వీరమరణం పొందారుకావున దేవలోకానికి వెళ్ళారు.
అక్కడ దేవగురువు బృహస్పతిని చూచి పీరుత్త - అని,
ఇంద్రుని విషయంలో సులతాన్ అని, శచీదేవిని
గురించి బీబీ, నమస్కారించేప్పుడు సలాం అని
తమ భాషలో పలుకుతూ దేవతలను చిరునవ్వు
కలవారినిగా చేసినారు. దేవతలకు వీరి భాషా
పదాలు తెలియక వారు నవ్వుకున్నారు -
శ్లోక భావం.

ఇంతకూ ఈ శ్లోకం వల్ల తెలిసేదేమిటంటే
కృష్ణదేవరాయలు యుద్ధంలో
పారశీక రాజులను జయించాడని.

No comments:

Post a Comment