Thursday, December 1, 2016

వేసవిలో పగలేందుకు దీర్ఘమో


వేసవిలో పగలేందుకు దీర్ఘమో




సాహితీమిత్రులారా!


ఎండాకాలాన్ని ఆముక్తమాల్యదలో
ద్వితీయాశ్వాసంలో 44వ పద్యం నుండి 70వ పద్యం
వరకు వర్ణించాడు. అందులోని ఒక పద్యం ఇది-

పడమర వెట్టు నయ్యుడుకుప్రాశన మొల్లక కూటికిపేదలై
బడలిక నూడు నచ్చిలువ ప్రగ్గములన్ రవియాజ్ఞ మాటికిన్
ముడియిడఁ బిచ్చుగుంటు రథము న్నలుప న్బయనంబు సాగమిన్
జడను వహించె నాఁగ దివసంబులు దీర్ఘము లయ్యె నత్తఱిన్
                                                                  (ఆముక్తమాల్యద -2-49)


సూర్యరథానికి సారథి అనూరుడు(తొడలు లేనివాడు)
ఆ రథానికి పగ్గాలు పాములు. ఎండాకాలంలో
పడమర నుండి వీచే గాలులు వేడిగా ఉండటం
వలన గాలిని మేసే పాములు గాలిని తినలేక
నీరసించి పోయినాయి. రథసారధి అనూరుడు
పగ్గాలను లాగడంవల్ల అవి తెగిపోతున్నాయి.
సూర్యుని ఆనతిమేర తెగిన ప్రతిసారి రథాన్ని
నిలిపి పాము పగ్గాలను ముడి వేసి బిగించి రథాన్ని
నడిపవలసి వచ్చిది. అందువల్ల సూర్యరథయానం
ఆలస్యమైపోతుందట. దానివల్ల ఎండాకాలంలో
పగలు దీర్ఘములౌతున్నాయట - అని భావం.

ఎంతటి అపూర్వమైన ఊహయో కదా !

No comments:

Post a Comment