Sunday, December 25, 2016

పీనస రోగమున్నవాడు వాసనను గ్రహించలేడు


పీనస రోగమున్నవాడు వాసనను గ్రహించలేడు



సాహితీమిత్రులారా!


ఒక కవి వ్యంగగా కస్తూరిని సంబోధిస్తూ
చెప్పిన అన్నాపదేశ పద్యం ఇది
చూడండి-

పీనస రోగి నిన్ను తిలపిష్ట సమానము చేసినంతనే
వాని వివేక హీనతను వందురనేల కురంగనాభమా
మానవతీకపోలకుచమండలమండిత చిత్రపత్రికా
నూన వితాన వాసనల నుండుట లోకము నిన్నెరుంగదే
                                                                                (ప్రబంధరత్నాకరము)

కస్తూరి మంచి పరిమళం గల సుగంధద్రవ్యం.
పీనసరోగమున్నవాడు వాసనను గ్రహించలేడు
కాబట్టి అతని దృష్టిలో తెలకపిండి, కస్తూరి
రెండూ ఒక రకంగానే అనిపిస్తాయి అది వాని
అజ్ఞాన ఫలితం.

ఓ కస్తూరీ!  నీవు ఆ విషయంలో బాధపడవద్దు.
యువతుల చెక్కిళ్ళమీద, స్తనాల మీద
కస్తూరితో చిత్రించిన రకరకాల చిత్రాలను
వాటినుండి వ్యాపించే సువాసనను
ప్రపంచం గుర్తిసుంది కదా!

ఇది వ్యంగ్యంగా మరో అర్థాన్ని తెలుపుతుంది-
కవి పండితుల వైదుష్యాన్ని, ప్రతిభను
ఒక వివేకి గుర్తించనంత మాత్రాన
వారి గొప్పతనానికి ఏ విధమైన కొరత కలగదు.
ప్రపంచం వారి గొప్పదనాన్ని తప్పక గుర్తిస్తుంది
- అని భావం.

No comments:

Post a Comment