Friday, March 16, 2018

శ్రీకృష్ణ కీర్తన


శ్రీకృష్ణ కీర్తన


సాహితీమిత్రులారా!




వంగభాషలో రాధాకృష్ణుల మీద ప్రణయకావ్యాన్ని రచించిన భక్తకవి
చండీదాసు(1417-77). వసంతరంజన్ రామ్ అనే పరిశోధకుడు
చండీదాసు పదాలను పరిష్కరించి 1916లో వంగీయసాహిత్య
పరిషత్తు తరపున ప్రచురించాడు. ఆయనే ఈ పదాలకు శ్రీకృష్ణకీర్తన
అనే పేరు పెట్టాడు. భగవంతుని ప్రియునిగా భావించే మధురభక్తి
సంప్రదాయం ఈ పదాలలో కనిపిస్తుంది. ఇందులో అక్కడక్కడా
భక్తికన్నా రక్తి హద్దులుదాటి అస అసభ్యతకు కూడ దారి తీసినట్లు
గమనించవచ్చు. 
        చిన్నవయసులోనే తండ్రిపోగా జీవికకోసం వాసతీదేవి (కాళికాదేవి) ఆలయంలో అర్చకుడుగా చేరాడు. ఆ గుడిలేో పరిచారిక అయిన చాకతె రామితో ఈ యువపురోహితునికి సంబంధం ఏర్పడింది. వీరిద్దరి శారీరక ప్రణయం లోకోత్తరమైన జీవేశ్వరైక్య సంధాయకమైన విశుద్ధ ప్రణయానికి దారితీసింది. తెలుగులో క్షేత్రయ్య కూడ ఒక దేవదాసిని గాంచి మోహితుడై తద్వారా గొప్ప భక్తునిగా పరిణతి చెందాడని చెబుతారు. కామం మోక్షానికి దారితీసే సంఘటనలు మన భారతీయ సాహిత్యంలో కొల్లలుగానే కనిపిస్తాయి. 

       దాదాపు 1200పదాలున్న శ్రీకృష్ణకీర్తనలో 13 విభాగాలున్నాయి. అవి జన్మఖండం, తాంబూలఖండం, దానఖండం, నౌకాఖండం, భారఖండం, ఛత్రఖండం, బృందావనఖండం, యమునాఖండం, వస్త్రాపహరణఖండం, బాణఖండం, వంశీఖండం, కాళీయదమన ఖండం, విరహఖండం. గేయనాటికగా సాగిపోయే ఈ కావ్యంలో  ఒక బడాయి(ముసలి) ప్రధానపాత్రలు. సంవాదాత్మకంగా సాగే ఈ గేయనాటికలో గేయాలను అనుసంధానం చేస్తూ మధ్యమధ్య ఒకటి
రెండు సంస్కృత శ్లోకాలు వస్తాయి. 
        నవయౌవనవతి అయిన రాధను చూచి శ్రీకృష్ణుడు ఆకృష్టుడవుతాడు. "బడాయి" అవ్వ కృష్ణుని తరపున కానుకలు తీసుకొని రాధ దగ్గరకు వెళుతుంది. రాధ కోపంతో తిరస్కరిస్తుంది. నాలుగు చీవాట్లు పెడ్తుంది. బడాయి అవ్వ సలహామేరకు కృష్ణుడు పన్నులు వసూలు చేసే ఉద్యోగివేషంలో వచ్చి మధురలో పాలు అమ్ముతు న్నందుకు పన్నుకట్టమని రాధను నిర్భంధిస్తాడు. రాధ డబ్బులిచ్చే స్థితి లేక కృష్ణుడికి లొంగిపోతుంది. ఇదీ దానఖండంలోని కథ. రాధ కృష్ణుని వశమైనా ఆమె హృదయంలో మాత్రం కృష్ణునికి చోటు లేకపోయింది. బడాయి అవ్వ చెప్పిన ఉపాయం మేరకు కృష్ణుడు నావికుని వేషంలో ఉంటాడు. రాధ ఈ నావికుని పడవలో ఎక్కుతుంది. మధ్యలో కృష్ణుడు నావను తలక్రిందులు చేయడంతో రాధ ప్రాణభీతితో కృష్ణుని కౌగిలించుకుంటుంది. ఇది నౌకాఖండంలోని ఇతివృత్తం. రాధ మధురకు అమ్మకానికి వస్తువులు తీసుకొని పోతుండగా కృష్ణుడు కూలివేషంలో వాటిని మోసికొని పోవడం, తిరిగి వచ్చేటప్పుడు రాధకు ఎండ తగలకుండా కృష్ణుడు ఛత్రం పట్టడం వరుసగా భారఖండం, ఛత్రఖండంలోని అంశాలు. బృందావన ఖండంలో 
రాధ కలహాంతరితగా రసరమ్యంగా చిత్రించబడింది. యమునా ఖండంలో రాధాకృష్ణుల జలక్రీడలు, బాణఖండంలో రాధ విరహతాపం, కృష్ణుడు స్వాంతనపరచడం, వంశీఖండంలో తప్పించుకు తిరుగుతున్న కృష్ణుని మురళిని దొంగిలించి రాధ కృష్ణుని తన వశం చేసుకోవడం ప్రసక్తాంశాలు. కంసాదిరాక్షస సంహారం, లోకోద్ధరణలో మునిగితేలుతున్న కృష్ణునికి దూరమై రాధ విరహాతిశయాన్ని ఎంతో ఉజ్జ్వలంగా చిత్రించాడు.

   చండీదాసు పదాలు  Amours de Radha et Krishnaఅనే పేరుతో ప్రెంచిభాషలోకి అనూదితమైనాయి.  చండీదాసు పేరుతో మరో ఇద్దరు ఉన్నారు వారు దీనచండీదాసు, ద్విజచండీదాసు అనే వారు. వీరు కూడ
రాధకృష్ణుల ప్రణయగీతాలనే రచించారు.

No comments:

Post a Comment