Saturday, March 10, 2018

హిమగిరిపతాకే కరుణయా


హిమగిరిపతాకే కరుణయా



సాహితీమిత్రులారా!



మూక శంకర విరచిత
మూకపంచశతిలోని
స్తుతిశతకంలోని
54వ పద్యం ఇది చూడండి-

ఘనశ్యామాన్కామాంతకమహిషి కామాక్షి మధురాన్
దృశాం పాతానేతానమృతజలశీతాననుపమాన్
భవౌత్పాతే గీతే మయి విరత నాథే దృఢభవ
న్మనశ్శోకే మూకే హిమగిరిపతాకే కరుణయా

కామాంతకుడైన శివుని యజమానురాలివై,
ఇల్లాలివైన ఓ కామాక్షీ
మేఘములవలె నల్లనైన కురులతో,
చల్లనైన అమృత జలముతో
మధురమైన వాక్కులతో కలిగిన నీవు
దృష్టి పాతములతో భయాందోళనలతో
నున్న భక్తుల కష్టములను చూచి కరిగి
అప్పుడప్పుడు ఆమె కన్నులు చెమ్మగిల్లును.
ఆమె కన్నులలో
శీతలామృతమును కురింపించుచూ
భక్తుల భయాందోళనలను
కరుడు గట్టిన శోకమును హరించును - అని భావం.


No comments:

Post a Comment