Monday, May 22, 2017

యవనీ నవనీత కోమలాంగీ


యవనీ నవనీత కోమలాంగీ




సాహితీమిత్రులారా!



మొగల్ చక్రవర్తి షాజహాన్ ఆస్థానంలో
కొంతకాలం పండిత జగన్నాథరాయలు
ఉన్నాడట. ఆ సమయంలోని ఒక సంఘటన-

చక్రవర్తి ఆస్థానంలో ఒక యువతిని చూచి
ఈ శ్లోకం చెప్పాడట.

యవనీ నవనీత కోమలాంగీ
శయనీయే యది మామకే శయనా
అవనీతలమేవ సాధు మన్యే
న వనీ మాఘవనీ వినోదహేతుః

వెన్నెలవలె కోమలమైన శరీరంగల
ఈ యవన(మహమ్మదీయ)స్త్రీ
నా శయ్యపై శయనించినట్లయితే
ఇంద్రుని నందనోద్యాన విహారము
కంటే మామూలు నేలయే శ్రేష్ఠమని
భావిస్తాను. - అని శ్లోక భావం.
అంటే ఆ యువతి సమాగమం కలిగితే
కటికనేలకూడ నందనవనం కంటే గొప్పదిగా
భావిస్తాను అని ఆమెపైగల గాఢానురాగాన్ని
వెల్లడించాడు.

No comments:

Post a Comment