Thursday, May 4, 2017

పోతన సరస్వతీదేవి ప్రార్థన


పోతన సరస్వతీదేవి ప్రార్థన




సాహితీమిత్రులారా!


పోతన భాగవతంలో
మొదట సరస్వతీదేవిని
ప్రార్థిన ఈ పద్యం చూడండి-

పుట్టం బుట్టి శిరంబునన్ మొలవ, నంభోపాత్రంబునన్
నెట్టం గల్గును, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతు దత్సరణి నా కీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ నాకగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ దయాంభో నిధీ

అమ్మా! సరస్వతీదేవీ! నేను తలపై పుట్ట
పెరిగిన ఆదికవి వాల్మీకిగా పుట్టలేదు.
పడవలో పుట్టిన వ్యాసుడను కాను.
కాళికను కొలిచిన కాళిదాసునికాను.
అయినా భాగవత పురాణాన్ని తెనిగంచటానికి
పూనుకొన్నాను. ఏం చెయ్యాలో, ఏమీ తోచటంలేదు.
ఇటువంటి సమయంలో ఎటువంటిమార్గము అవసరమో
అది నీవే నాకు అనుగ్రహించి నాచేయి పట్టుకొని
నడిపించు, ముమ్మాటికి నిన్నే నమ్ముకున్నాను తల్లీ!
నీవే ఆధారం. నాకు తెలుసు తల్లీ నీ కరుణ అపార పారావారం-
అని భావం

దీనిలో పోతన తన నిజమైన భావనను వ్యక్తం చేస్తున్నాడు
నేను వాల్మీనికాను, వ్యాసుని కాను, కాళిదాసుని కాను
ఏదో ఈ పని చేయాలని పూనుకొన్నాను నీకృపతో
నాకుదారిచూపమని దైవంమీ భారం వేశాడు తనపని తాను చేశాడు.
అదీ పోతన

No comments:

Post a Comment