Friday, June 8, 2018

అక్కమహాదేవి


అక్కమహాదేవి




సాహితీమిత్రులారా!


కన్నడ వచన సాహిత్యంలో పేరెన్నికగన్న బసవన్న, అల్లమప్రభువు,
దేవర దాసిమయ్య మొదలైన వారికి ఏమాత్రం తీసిపోని
అత్యుత్తమ శ్రేణికి చెందిన వచనాలను వ్రాసిన కవయిత్రి ఈ అక్కమహాదేవి.
శ్రీశైల మల్లికార్జునినే తన భర్తగా భావించిన ఈ భక్తురాలిని కౌశికుడనే రాజు బలవంతాన వివాహం చేసుకున్నాడు. కాని త్వరలోనే ఆ బంధాన్ని తెంచుకొని ఆమె శ్రీశైలానికి పయనమైంది. దారిలో కల్యాణపట్టణం వెళ్ళింది. ఆ రోజుల్లో వీరశైవ మతానికి కల్యాణపట్టణం ప్రధానకేంద్రం. అక్కడ అల్లమప్రభువునూ, బసవన్ననూ కలిసి
వారి ప్రశంసకు పాత్రురాలైంది. తర్వాత శ్రీశైలంచేరి అక్కడ కదళీవనంలో ఆరాధ్యదైవాన్ని చేరుకుంది.
చెన్నమల్లికార్జునా అనే మకుటంతో అక్కమహాదేవి రచించిన వచనాలు
ఆమె భక్కికి దర్పణాలు మాత్రమే కాక ఉత్తమ కవితాఖండికలుగాకూడా పేరు పొందాయి. వాటిలో ముఖ్యంగా కనిపించేది అక్క అంతరంగ ప్రదర్శనం, వైరాగ్యభావం, అంతరంగశుద్ధి, ఆత్మనివేదనం, పరిశుద్ధ భక్తి.

No comments:

Post a Comment