Tuesday, December 5, 2017

శతకాలలో సీస పద్యరచన


శతకాలలో సీస పద్యరచన




సాహితీమిత్రులారా!

మన సీసపద్యంలో సీసమనేది సంస్కృతంలో శీర్షిక అనే పదం నుండి
పుట్టింది. ఈ ఛందస్సుతో రచించిన రచన శీర్షమును, అంటే
శిరస్సును అలంకరించినట్లగును. సీసము సాధారణంగా ఏదైనా విషయంకాని, కథా సందర్భములను గాని వివరించే చోట్లనే కవులు ఉపయోగించారు. ప్రబంధవర్ణనలలో సీసపద్యము కనబడతాయి.
సీసముతో మొదట శతకం వ్రాసినవాడు 
పాల్కురికి సోమనాథుడనే చెప్పవచ్చు. ఈయన వ్రాసిన 
చతుర్వేదసారము అనే దానికి
బసవలింగ శతకమని మరోపేరుంది. దీనికి గలకారణం "బసవలింగ "
అనే సంబోధనతో లేదా మకుటంతో ఉండటమే. దీనిలో సంఖ్యాపరంగా
చూస్తే దీనిలో నాలుగువందల సీసపద్యాలున్నాయి. అంటే నాలుగు 
శతకాలు. ఈ సీసపద్య శతకాల్లో రెండు విభాగాలున్నాయి 
1. సీసముతోటి ఆటవెలది అనుసంధానింపబడినవి
2. సీసముతోటి తేటగీతి అనుసంధానించబడినవి

అయితే ఇక్కడ సోమన వ్రాసిన పద్యాలన్నీ ఆటవెలది 
అనుసంధాన పద్యములే. పూర్వం సీసాలన్నీ ఆటవెలది అనుసంధానితాలే అందువల్లసోమనాథుడు ఈ విధంగా వ్రాశాడు.
ఉదాహరణ పద్యం -
బసవన్న శ్రీపాద పద్మ పుష్పంధయ
         స్థేముండు పాల్కుర్కి సోముడనగ
బసవపుర ప్రాప్యపర్వతోత్తర ముఖ
         సీముండు పాల్కుర్కి సోముడనగ
బసవపురాణ ప్రబంధ సంఘటనాభి
         రాముండు పాల్కుర్కి సోముడనగ
బసవ శతక గద్య పద్యాది సంస్కృతి
         ధాముండు పాల్కుర్కి సోముడనగ
పరగ ప్రస్తుతించి భావించి భజియించి
బసవ విభుని కరుణ యెసగ బడసి
నిర్వికల్పరతి చతుర్వేదసారమన్
పద్యముల్ రచింతు బసవలింగ

ఈ సోమశేఖరకవి విరచిత శతకాలు మరి రెండున్నట్లు 
తెలుస్తున్నది 
సోమశేఖర శతకంలోని పద్యం-
తలకమ్మి కొండయు, విలుకమ్మి కొండయు
         గడయును నడుముగా గలుగుతేరు
సరసిజ ముకుళంబు సద్వాక్యకలనంబు
         మాతలినాలగు మాతలియును
మిన్నుల జనువాడు కన్నుల వినువాడు
         నంక పర్యంకంబులైన శరము
చల్లని పవనంబు నెల్లైన భువనంబు
          మేపును మోపుగా మెలగు నారి
కాకకోర్తు విల్లు గఱిగల గుఱ్ఱాలు
పగలు రేలు దిరుగు బండికండ్లు
గలగ బురజయంబు గైకొన్న నిను గొల్తు
చిరశుభాంక సోమశేఖరాంక


No comments:

Post a Comment