Tuesday, December 19, 2017

సుభాషిత త్రిశతి అనువాదకులు


సుభాషిత త్రిశతి అనువాదకులు




సాహితీమిత్రులారా!


సంస్కృతంలో భర్తృహరి రచించిన
సుభాషిత త్రిశతిని తెనుగులో
అనువదించిన వారి సంఖ్య
20వ శతాబ్ది వరకు ఆరుగురు
ఈ మధ్యకాలంలో అనుదించిన
వారున్నారేమో తెలియరాలేదు

మొదటివారు ఎలకూచి బాలసరస్వతి (1620)
రెండవవారు ఏనుగు లక్ష్మణకవి              (1725)
మూడవవారు పుష్పగిరి తిమ్మన             (1750)
నాలుగవవారు పోచిరాజు వీరన్న            (1790)
ఐదవవారు గురురాజ కవి                          (1810)
ఆరవవారు వెల్లాల నరసింగకవి               (1830)

వీరిలో పోచిరాజు వీరన్నస, గురురాజకవి ఆంధ్రీకరణలు
లభించలేదు. వెల్లాల నరసింగకవి ఆంధ్రీకరణ మాత్రం
ఒక్కసారిమాత్రం అచ్చైంది. ఆంధ్రపరిషత్ కార్యాలయంవారి
శతక సముచ్ఛయం మొదటి భాగంలో లభిస్తుంది.
ఎలకూచి బాలసరస్వతిగారి కంటె,
పుష్పగిరి తిమ్మనగారి కంటె
ఏనుగు లక్ష్మణకవిగారి ఆంధ్రీకరణం
బహుళ ప్రజాదరణ పొందింది.

No comments:

Post a Comment