Saturday, December 30, 2017

బ్రహ్మశిరము పగలబడి నవ్వుచున్నది


బ్రహ్మశిరము పగలబడి నవ్వుచున్నది




సాహితీమిత్రులారా!


తమిళవాఙ్మయంలో భక్తిసాహిత్యంలో
"తిరునావుక్కరసర్" అనే మహాకవికి
ప్రముఖ స్థానం వుంది.
ఈ కవిగారు పల్లవరాజైన
మొదటి మహేంద్ర వర్మ కాలంవాడంటారు.
ఈ మహాకవి 49వేల గీతములను పాడినట్లు
చెబుతుంటారు. ఈ కవి మహాదేవుని నుతించిన
ఈ గీతం చూడండి-
ఇందులో ఆ దేవాధిదేవుడు శివుడు గంగను,
ఆదిశేషుని, చంద్రరేఖను, బ్రహ్మకపాలాన్ని
ధరించినాడు. ఈ వస్తువులను చూచి
ఎంత చమత్కారంగా వర్ణించాడో తెలుస్తుంది.

కిడన్దపామ్ పరుగు కణ్డరివై పేదుర
క్కిడన్ద పామ్బవళై యోర్ మయిలెన్డైయుర
కిడన్ద నీర్జడైమిశైప్పిరైయు మేఙ్గువే
కిడన్దు తాన్ నగుదులై క్కెడిల వాణరే

శివుని జటాజూటమునగల గంగ ఒక అబల,
వక్షముపై యధేచ్ఛగా పడగెత్తే సర్పాన్ని చూచి
తాను అబల అవడంచే భీతచిత్తయైంది.
కాని ఆ సర్పము కేశపాశావృతమైన గంగను చూచి
తనను చీల్చటానికి పురివిప్పిన నెమలిగా భావించి
వగలబొగులుచున్నది. ఆ బాధతో ఉన్న పామును
చూచి చంద్రుడు తనను కబళించటాని వచ్చే రాహువేమో
అని కలతపడుచున్నాడు. ఈ దృశ్యాలన్నీ చూస్తున్న
బ్రహ్మశిరస్సు పగలబడి నవ్విందట స్వభావంచే విరుద్ధములైన
వానిని కూడ ఒకచో సమీకరించిన మహాత్ముడా మహాదేవుడు
అనుట కవి అభిప్రాయం.


No comments:

Post a Comment