Thursday, March 12, 2020

ఇచ్చటికేలవచ్చె రుసి


ఇచ్చటికేలవచ్చె రుసి




సాహితీమిత్రులారా!

ఠంయాల లక్ష్మీనృసింహాచార్యులుగారు
శుద్ధాంధ్రరామాయణ సంగ్రహం కూర్చారు
1925లో శ్రీకారం చుట్టి 100 పద్యాలు బాలకాండలో కూర్చారు
కానీ అది అంతటితో ఆగిపోయింది. ఇది అచ్చతెనుగు కావ్యం
ఇందులో  దశరథుని దగ్గరకు విశ్వామిత్రుడు వచ్చి
తన కోరిక తెలిపిన పిమ్మట రాముని పంపే విషయంలో
దశరథుని మనసులో కలిగిన మనోమథనం ఈ పద్యంలో
చూద్దాం. అంటా తెలుగు మాటలే ముచ్చటగా ఎలావుందో
గమనించండి.

ఇచ్చటికేల వచ్చె రుసి, హెచ్చుగ వచ్చిన గోలె తొల్త నే
నిచ్చెద కోరుకొమ్మనుచు నేటికి బల్కితి, బల్కితింక బో
ముచ్చటఁ దీర్చు బిడ్డలను పోరను సోకుల ద్రుంచగోరగా
వచ్చున జోగి యెంతటికి వచ్చెను యిట్టుల నౌత నేరనే

ఈ విధంగా కొనసాగుతూ విశ్వామిత్రుడు శ్రీరామచంద్రునకు
మంత్రాలు ఉపదేశించే ఘట్టంలో ఆగిపోయిందీ కావ్యం.

No comments:

Post a Comment